కేజ్రీవాల్‌ అధికారిక నివాసం `శీష్‌మహల్‌’ పై సివిసి దర్యాప్తు

కేజ్రీవాల్‌ అధికారిక నివాసం `శీష్‌మహల్‌’  పై సివిసి దర్యాప్తు
 
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి అధికార నివాసం 6 ఫ్లాగ్‌స్టాఫ్ బంగ్లా పునరుద్ధరణలో జరిగిన ఆర్థిక, నియంత్రణ అవకతవకలపై వివరణాత్మక దర్యాప్తుకు కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సివిసి) ఆదేశించింది. 40,000 చదరపు గజాల (8 ఎకరాలు) విస్తీర్ణంలో ఉన్న విలాసవంతమైన భవనాన్ని నిర్మించడానికి భవన నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలోరెండు రోజుల క్రితం ఈ దర్యాప్తును ఆదేశించారు, 
 
దీనిని ఇప్పుడు ‘షీష్ మహల్’ అని పిలుస్తారు. ప్రజా నిధుల దుర్వినియోగం,  భవన నిబంధనల ఉల్లంఘనలపై లోతైన విచారణ నిర్వహించాలని సివిసి కేంద్ర ప్రజా పనుల శాఖ (సిపిడబ్ల్యుడి)కి బాధ్యత అప్పగించింది. అక్టోబర్ 14, 2024న బిజెపి నాయకుడు విజేందర్ గుప్తా దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించారు.
 
 దీనిలో కేజ్రీవాల్ నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించారని, తన అధికారిక నివాసాన్ని నిర్మించడానికి ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్ (చివికి) తన మునుపటి రెండు ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని, ప్రజా పనుల శాఖ నుండి వాస్తవ నివేదికలను కోరిందని, దాని ఆధారంగా వివరణాత్మక దర్యాప్తు నిర్వహించాలని ఆదేశించిందని గుప్తా చెప్పారు. 
 
రోహిణి నుంచి కొత్తగా ఎన్నికైన బిజెపి ఎమ్మెల్యే సివిసికి చేసిన మొదటి ఫిర్యాదులో, కేజ్రీవాల్ 40,000 చదరపు గజాల (8 ఎకరాలు) భూమిని కప్పి విలాసవంతమైన భవనం నిర్మించడానికి భవన నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు. 
 
రాజ్‌పూర్ రోడ్‌లోని ప్లాట్ నంబర్లు 45, 47 (గతంలో టైప్-V ఫ్లాట్‌లలో సీనియర్ అధికారులు, న్యాయమూర్తులను ఉంచేవారు),  రెండు బంగ్లాలు (8-ఎ, 8-బి, ఫ్లాగ్ స్టాఫ్ రోడ్) సహా ప్రభుత్వ ఆస్తులను కూల్చివేసి కొత్త నివాసంలో విలీనం చేశారని, గ్రౌండ్ కవరేజ్, ఫ్లోర్ ఏరియా నిష్పత్తి నిబంధనలను ఉల్లంఘించారని, సరైన లేఅవుట్ ప్లాన్ ఆమోదాలు లేవని గుప్తా ఆరోపించారు.
 
గుప్తా తన రెండవ ఫిర్యాదులో, ఫ్లాగ్ స్టాఫ్ రోడ్‌లోని 6వ బంగ్లా పునరుద్ధరణ, ఇంటీరియర్ డెకరేషన్‌పై “దుబారా ఖర్చు” చేశారని ఆరోపించారు. “భారీ ఆర్థిక అవకతవకలు”, బంగ్లాలోని విలాసవంతమైన సౌకర్యాల కోసం పన్ను చెల్లింపుదారుల డబ్బు నుండి కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని కూడా ఆయన ఆరోపించారు.