
కేరళ రాష్ట్రంలో దారుణం జరిగింది. మైనర్ అయిన ఓ క్రీడాకారిణిపై ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 60 మంది లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. గడిచిన ఐదేళ్లల్లో తనపై 60 మందికి పైగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని 18 ఏళ్ల ఆ క్రీడాకారిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను మైనర్గా ఉన్నప్పుడే ఇదంతా జరిగిందని తన ఫిర్యాదులో పేర్కొంది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, లైంగిక వేధింపులకు సంబంధించి మహిళ సమాఖ్య సొసైటీ నిర్వహించిన కౌన్సిలింగ్ సెషన్లో క్రీడాకారిణి తనకు జరిగిన దారుణాల గురించి చెప్పింది. ఈ విషయంపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమాచారం అందించారు.
అనంతరం సైకాలజిస్ట్ సాయంతో ఆ యువతికిపై జరిగిన లైంగిక వేధింపుల గురించి పూర్తి సమాచారాన్ని సేకరించారు. దీనిపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పథనంథిట్ట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 13 ఏళ్ల ప్రాయంలోనే తనపై అత్యాచారం జరిగిందని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది.
తన పొరుగింట్లో ఉన్న ఓ వ్యక్తి తనను కొండల ప్రాంతానికి తీసుకెళ్లి, ముగ్గురు స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. ఆ తర్వాత కోచ్లు, క్లాస్మెట్స్, అథ్లెట్స్ ఎక్కువగా లైంగికంగా వేధించారని వెల్లడించింది. యువతి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు చెప్పిన వివరాలు ప్రకారం 62మందిని అనుమానితులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
వారిలో 40 మందిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారని, మరో వ్యక్తి ఇప్పటికే మరో పోక్సో కేసులో జైల్లో ఉన్నాడని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం ఆ యువతిని కౌన్సిలింగ్కు పంపించినట్లు పథనంథిట్ట ఎస్పీ తెలిపారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
More Stories
ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా మద్యం సేవించే మహిళలు
మహాకుంభ్లో 50 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు
కేరళ దేవాలయంలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి