* శిథిలాల కింద చిక్కుకున్న పలువురు కూలీలు
ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ రైల్వేస్టేషలో నిర్మాణంలో ఉన్న ప్రవేశద్వారం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. దాంతో నిర్మాణ పనులు చేస్తున్న పలువురు కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్స్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నాయి. సహాయక చర్యలు మొదలుపెట్టాయి.
ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 35 మంది ఉద్యోగులు ఘటనా స్థలంలో ఉన్నారు. ఇప్పటివరకు రక్షణ బలగాలు శిథిలాల కింది నుంచి 23 మందిని వెలికితీశాయి. వారిలో స్వల్పంగా గాయపడిన 20 మంది కన్నౌజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని మెరుగైన చికిత్స నిమిత్తం లక్నో ఆస్పత్రికి తరలించారు.
శిథిలాల కింద చిక్కుకుని ఉన్న మిగతా కూలీలను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ టీమ్స్తోపాటు స్థానిక అధికారులు, పోలీసులు ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ రైల్వేస్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ స్పందించారు.
ప్రమాద ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సీఎం యోగి చెప్పారు. వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి తక్షణమే అవసరమైన మెడికల్ ట్రీట్మెంట్ను సమకూర్చాలని సూచించారు. బాధితులంతా త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు.
More Stories
మంత్రులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు
భార్యతో సెల్ఫీతోనే మావోయిస్టు చలపతి హతం!
పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు