* కాంగ్రెస్ సంబురాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు
లగచర్ల ఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్ కు బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ ఫిర్యాదు చేశారు. రైతులను పోలీసు కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురిచేశారని, ఇప్పటికీ పోలీసులు, అధికార పార్టీ నాయకులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని జాతీయ మానవ హక్కుల కమిషనర్ దృష్టికి ఆయన తీసుకువెళ్లారు.
వెంటనే కమిషన్ బృందాలను లగచర్లకు పంపించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని రాజేందర్ విజ్ఞప్తి చేసారు. కమీషన్ కూడా సానుకూలంగా స్పందించిందని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ సంబురాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మెజార్టీ ప్రజలు చెబుతున్నారని ఈటల తెలిపారు. తెలంగాణలో ఇచ్చిన హామీల చర్చపై రేవంత్ సవాల్ను స్వీకరిస్తున్నని చెబుతూ నీ హామీల అమలుపై చర్చకు మోదీ ఎందుకు? ఇక్కడ తాము ఉన్నమని తెలిపారు.
రేవంత్ ఎక్కడ చర్చకు రావాలో చెప్పు మేము సిద్దంగా ఉన్నాం. నీ ఆరు గ్యారంటీలే కాదు 420 హామీలపై చర్చిద్దాం అని సవాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఫార్మా సిటీ రద్దు చేస. రైతులకు తిరిగి భూమి ఇస్తామని చెప్పారని రాజేందర్ గుర్తు చేశారు. అయితే, ఫోర్త్ సిటీ పేరుతో 14 వేల ఎకరాలకు తోడుగా మరో 16 వేలు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోందని, అక్రమంగా రైతుల భూములు లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కొడంగల్లో రైతులు భూమి ఇవ్వలేమని కాళ్ళు మొక్కినా బెదిరించి సేకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. స్వయంగా కలెక్టర్ తనపై దాడి జరగలేదని చెప్పారని పేర్కొంటూ లగచర్ల చుట్టూ పక్కల గ్రామాలకు మాత్రమే సమస్య కాదని స్పష్టం చేశారు. ప్రతీ రైతు రేపటి రోజున తమకూ ఇటువంటి సమస్య వస్తుందని భయపడుతున్నారని ఈటల రాజేందర్ తెలిపారు.రైతులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని మండిపడుతూ రైతులు నక్సలైట్లు కాదని, వేరే వాళ్ళ భూములు అడగడం లేదని ఆయన గుర్తు చేశారు. రేవంత్ రెడ్డిది మా కొడంగల్ కాకపోయినా గెలిపిస్తే మమల్ని హింసిస్తున్నారని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారని ఆయన చెప్పారు. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం.. కానీ రేవంత్ రెడ్డిలా ప్రజలను ఇంతగా ఎవరు హింసించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ పక్కన ఉన్న భూములను లాక్కొని.. కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారని రాజేందర్ ఆరోపించారు.
ఏ వర్గాన్ని వదలకుండా అన్ని వర్గాల ప్రజలను రేవంత్ మోసం చేశాడని చెబుతూ నిరుద్యోగ భృతి ఏమైంది..? ఆర్టీసీ కార్మికులకు ఇస్తామని చెప్పిన రెండు పెండింగ్ పీఆర్సీలు ఎందుకు ఇవ్వడం లేదు..? అని ప్రశ్నించారు. కడుపు నొప్పి వస్తే టాబ్లెట్ దొరకదు.. కానీ కిరాణా కొట్టులో మాత్రం లిక్కర్ దొరుకుతుందని ఎద్దేవా చేశారు. హామీలు నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ మంత్రులే అంటున్నారని ఆయన చెప్పారు. రేవంత్ రెడ్డి భూమి మీదకు వచ్చి మాట్లాడాలని రాజేందర్ సవాల్ చేశారు.
ఏ వర్గాన్ని వదలకుండా అన్ని వర్గాల ప్రజలను రేవంత్ మోసం చేశాడని చెబుతూ నిరుద్యోగ భృతి ఏమైంది..? ఆర్టీసీ కార్మికులకు ఇస్తామని చెప్పిన రెండు పెండింగ్ పీఆర్సీలు ఎందుకు ఇవ్వడం లేదు..? అని ప్రశ్నించారు. కడుపు నొప్పి వస్తే టాబ్లెట్ దొరకదు.. కానీ కిరాణా కొట్టులో మాత్రం లిక్కర్ దొరుకుతుందని ఎద్దేవా చేశారు. హామీలు నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ మంత్రులే అంటున్నారని ఆయన చెప్పారు. రేవంత్ రెడ్డి భూమి మీదకు వచ్చి మాట్లాడాలని రాజేందర్ సవాల్ చేశారు.
More Stories
ప్రజాస్వామ్యానికి మూల స్తంభం మీడియా
కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసు దోషికి జీవిత ఖైదు
అక్రమ వలసదారులను తిప్పి పంపుతా