అక్టోబర్ 21న సీఐడీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఐడీ అధికారులతో కలిసి ఆయన టీ తాగారు. అయితే సీఎంకు సర్వ్ చేసేందుకు ప్రత్యేకంగా ఉంచిన మూడు బాక్సుల సమోసాలు మాయమయ్యాయి. దీంతో సీఐడీ అధికారులు గందరగోళానికి గురయ్యారు.
కాగా, సీఐడీ కార్యాలయంలోని మహిళా అధికారిణి ఆ సమోసాల బాక్సులను సీఎం భద్రతా సిబ్బందికి ఇచ్చినట్లు తెలిసింది. దీంతో సీఎం కోసం ఉంచిన ఆ సమోసాలు వారు తిన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సీఐడీ అంతర్గత దర్యాప్తు జరుపుతోంది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్లో ప్రతిపక్షమైన బీజేపీ దీనిపై విమర్శలు గుప్పించింది. సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు కోసం ఉంచిన సమోసాలు మాయం కావడంపై సీడీఐ దర్యాప్తు చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ఆరోపించింది.
అయితే సీఐడీ దీనిని ఖండించింది. కేవలం అంతర్గతంగా ఆరా తీసినట్లు సీఐడీ డీజీ తెలిపారు. సీఎంవో కార్యాలయం కూడా ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టింది. బీజేపీకి ఏ సమస్యలు కనిపించకపోవడంతో ఈ అంశంపై తప్పుడు ప్రచారం చేస్తున్నదని మీడియా ప్రధాన సలహాదారుడు నరేష్ చౌహాన్ విమర్శించారు.

More Stories
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ ‘రాజకీయ ప్రేరేపితం’
ఇండియా కూటమిలో కాంగ్రెస్ పై సిపిఎం, జేఎంఎం అసంతృప్తి
గిల్గిట్-బాల్టిస్తాన్లో ఎన్నికలా?.. భారత్ హెచ్చరిక