” హింసకు కారకులైన వారిని శిక్షిస్తారని మేం ఆశిస్తున్నాం. కెనడాలో మా దేశీయుల భద్రత గురించి భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన చెందుతోంది. భారతీయులకు కాన్సులర్ సేవలు అందించే దౌత్యవేత్తలు ఈ తరహా బెదిరింపులకు తలొగ్గరు’’ అని జైస్వాల్ తెలిపారు.
బ్రాంప్టన్లోని ఆలయ కాంప్లెక్స్లో కొందరు ఖలిస్థానీలు – హిందూ భక్తులపై దాడులు చేస్తున్న వీడియో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో ఆలయం వద్ద భారీగా భద్రతా దళాలను మోహరించారు. దీనిని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో సైతం తీవ్రంగా పరిగణించారు. కెనడాలోని ప్రజలు అన్ని మతాలను పాటించే హక్కును కాపాడతామని ఆయన పేర్కొన్నారు. అయితే కెనడాలో హిందూ దేవాలయాలపై దాడి జరగడం ఇదే మొదటిసారి కాదు. 2023లో విండ్సోర్లోని ఆలయ గోడలపై కొందరు దుండగులు భారత వ్యతిరేక నినాదాలను రాశారు.

More Stories
మీనాక్షి నటరాజన్ పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
భారత దిగ్గజ షూటర్ జస్పాల్ రాణా మృతి
మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న రైల్వే కోచ్ పై రాళ్లు!