జవాన్లతో కలిసి రాజ్‌నాథ్ సింగ్ ఆయుధపూజ

జవాన్లతో కలిసి రాజ్‌నాథ్ సింగ్ ఆయుధపూజ
దేశవ్యాప్తంగా విజయదశమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్  డార్జిలింగ్‌ లోని శుక్నా కంటోన్మెంట్‌లో శనివారంనాడు భారత జవాన్లతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయుధ పూజ చేసి వీరజవాన్లకు తిలకం దిద్దారు.  రక్షణ మంత్రి తొలుత ‘కలశ పూజ’తో ఆచారాలను ప్రారంభించారు, తర్వాత ‘శాస్త్ర పూజ’,  ‘వాహన్ పూజ’ జరిపారు. జవాన్లకు, వారి కుటుంబాలకు విజయ దశమి శుక్షాకాంక్షలు తెలిపారు.
వారిలో ఒకడిగా విజయదశమి వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.  ”శస్త్రపూజను ఎంతో శ్రద్ధాభక్తులతో జరుపుకొనే కొద్ది దేశాల్లో భారతదేశం ఒకటి. మన ఆరాధ్యదైవాలను పూజించేటప్పుడు శస్త్రపూజ చేయడం మన సంప్రదాయం. దేశంలోని ప్రొఫెషనల్స్ అంతా ఏడాదికి ఒకసారి తమ పనిముట్లను పూజించడం మనం చూస్తుంటాం” అని తెలిపారు.
“దీపావళి, వసంత పంచమి రోజున విద్యార్థులు ఇంక్, పుస్తకాలకు పూజలు చేస్తారు. సంగీత విద్వాంసులు తమ వాయిద్యాలకు పూజు చేస్తారు. దేశంలోని అనేక కుటుంబాలు వ్యవసాయ సంబంధిత కుటుంబాలు ఉన్నాయి. శస్త్రపూజ అంటే కేవలం వాటిని పూజించడమే కాదు, పని పట్ల మనకున్న గౌరవాన్ని చాటుకోవడం కూడా అవుతుంది” అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.

ఏళ్ల తరబడి జవాన్లు ఆయుధపూజ చేయడం సంప్రదాయంగా వస్తోందని, ఈరోజు విజయానికి సంకేతమని, శ్రీరాముడు రావణుని సంహరించిన రోజని తెలిపారు. ఇది కేవల విజయం కాదు, మానవతావాదాన్ని దక్కిన విజయమని చెప్పారు. శ్రీరాముని లక్షణాలు మన జవాన్లలో తాను చూశానని, ఈ రోజు వరకూ మన సంస్కృతిని అవమానించినప్పుడు మాత్రమే భారతదేశం ఇతర దేశాలపై దాడి జరిపిందని, విద్వేషం కారణంగా ఎన్నడూ దాడులు చేయలేదని స్పష్టం చేశారు.

దేశ ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలిగినా ఎలాంటి పెద్ద చర్య తీసుకోవడానికైనా వెనుకాడేది లేదని, దేశ ప్రజలకు తాను భరోసా ఇస్తున్నానని ఈ సందర్భంగా రక్షణమంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ జవాన్ల ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకైనా సర్వసన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. విజయదశమి సందర్భంగా అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, రక్షణ కార్యదర్శిగా నియమితులైన ఆర్కే సింగ్, ఈస్టర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రామ్ చందర్ తివారీ, సరిహద్దు రోడ్ల డీజీ, లెఫ్టినెంట్ జనరల్ రఘు శ్రీనివాసన్, త్రిశక్తి కార్ప్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ పాల్గొన్నారు. లెఫ్టినెంట్ జనరల్ జుబిన్ ఎ మిన్‌వాలా, ఇతర సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.

 
ఈ సందర్భంగా సరిహద్దు భద్రతాదళం (బిఆర్ఓ)కు చెందిన 75 ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. వీటిలో, 18 ప్రాజెక్టులు అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్నాయి. వీటిల్లో మూడు కీలక రహదారులు, 14 వంతెనలు, బ్రహ్మాంక్, వర్తక్ మరియు ఉదయక్ ప్రాజెక్టుల క్రింద ఒక హెలిప్యాడ్ ఉన్నాయి. ప్రాజెక్ట్ వర్తక్ కింద, మూడు కీలకమైన రోడ్లు పూర్తయ్యాయి, మొత్తం 25.29 కి.మీ.