* దండకారణ్యంలో వరుస ఎన్కౌంటర్లతో తెలంగాణ వైపు చూపు!
మావోయిస్టులకు కొలుకోని దెబ్బతగిలింది. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులకు రక్షణకవచం అయిన అభూజ్మాడ్ (సెఫ్ జోన్) పై పోలీసులు పైచేయి సాధించారు. శత్రుదుర్బేధ్యంగా ఇన్నాళ్ళు తమకు సురక్షిత స్దావరంగా మలుచుకున్న మావోయిస్టుల అబుజ్ మడ్ పై భద్రతా బలగాలు క్రమేపి వశపర్చుకోవడం ప్రారంభించాయి.
శుక్రవారం బస్తర్ దండకారణ్యంలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 31మంది మరణించడం మావోయిస్టులను చావు దెబ్బతీయగా మరోవైపు పోలీసు బలగాలు అభూజ్మాడ్ను తమ ఆదీనంలోకి తీసుకునే ప్రయత్నాలు ఫలించినట్లు అవుతుంది. మావోయిస్టు కేంద్ర కమిటి ఇతర కమిటీల కీలకనేతలంతా ఇక్కడే తలదాచుకుంటారు.అలాంటి అబుజ్ మడ్ పై పోలీసులు పట్టుసాధించారు.
దంతెవాడ – నారాయణపూర్ సరిహద్దు లో బస్తర్ డివిజన్లో నెందుర్-తుల్తులిలో జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మరణించినట్లు బస్తర్ డిఐజి సుందర్ రాజ్అధికారికంగా వెల్లడించారు.ఈ ఎన్కౌంటర్లో, 18 మంది పురుషులు 13 మంది మహిళలతో సహా 31 మంది సాయుధ యూనిఫాం ధరించిన మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
అంతేగాకుండా పెద్ద సంఖ్యలో నక్సలైట్లు గాయపడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే శనివారం సాయంత్రం వరకు మరణించిన వాలో 15 మందిని గుర్తించారు వారిలో డివిసి, ,డికెఎస్ జెడ్ సి 6 కి చెందిన అనేక కేడర్ లతో పాటు, రూ. 8 లక్షల రివార్డ్తో కూడిన డిబిసిఎం రెండు క్యాడర్లు పి ఎల్ జి ఏ కంపెనీ 6కి చెందిన 9 క్యాడర్లు ఉన్నట్లుగుర్తించారు. మిగిలిన వారి గుర్తింపు ప్రక్రియ జరుగుతోంది.
మృతుల్లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్, చత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా ఎర్మగూడకు చెందిన నీతి ఆలియాస్ ఊర్మిళ అలియాస్ కొప్పే (41), ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ సమీపంలో పెనమలూరు మండలం పోరంకి గ్రామానికి చెందిన జోరిగే నాగరాజు అలియాస్ రామక్రష్ణ అలియాస్ కమలేష్తోపాటు ఇద్దరు డివిజనల్ కమిటీ మెంబర్లు మడకం మీనా, సురేశ్ సలాం ఉండగా వీరందరిపై కోటి ముప్పై లక్షల రివార్డు ఉన్నట్లు డిఐజి సుందర్ రాజ్ వెల్లడించారు.
వీరి తర్వాత పీఎల్జీఏ, కంపెనీ 6కు చెందిన ఆరుగురు సభ్యులు, ఏరియా కమిటీ సభ్యులు ముగ్గురిని ఇప్పటి వరకు గుర్తించారు. పోరంకి గ్రామానికి చెందిన నాగరాజు ఐటిఐ చదివి అడువుల్లోకి వెళ్ళారు. ఈ ఘటనలో ఎల్ఎంజీ 1, ఏకే 47 4, ఎస్ఎల్ఆర్ – 6, ఇన్సాస్ -3, 303 రైఫిళ్లు 2తో పాటు దేశీయంగా తయారైన తుపాకులు లభించాయని డిఐజి వెల్లడించారు.
కాగా, మావోయిస్టు జాతీయ కార్యదర్శి నంబళ్ల కేశవరావు, తక్కెళ్లపల్లి వాసుదేవరావు తదితర అగ్రనేతలు ఉన్నట్టుగా పౌరహక్కుల సంఘం నేతలు అనుమానిస్తున్నారు. కాని వారు సురక్షితంగానే ఉన్నట్లు మరో వాదన వినిపిస్తోంది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేతలే చనిపోయినట్టుగా సందేహిస్తున్నారు. అయితే వారెవరు అనేదే ఉత్కంఠగా మారుతోంది.
పెద్ద మొత్తంలో పేలుడు పదార్ధాలను, ఆయుధాలను కూడా పోలీసు బలగాలు స్వాధీనం చేసుకున్నాయి ఈ ఎన్కౌంటర్లో కొందరు కీలక నేతలకు సైతం బుల్లెట్ గాయాలు అయినట్టు తెలుస్తోంది. అలా గాయపడిన మావోయిస్టు లు ఎక్కడికి వెళ్లారు? ఎటు వెళ్లారు? ఘటనా స్థలం నుం చి ఎంత దూరం వెళ్లారు? వారేమయ్యారు? సజీవంగా పోలీసులకు ఎవరైనా చిక్కారా? అనేది సస్పెన్స్ గా మారింది.
2024 జనవరి నుంచి జూలై వరకే పోలీసు దాడుల్లో 171 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ 20ఏళ్లలో పోలీసు దాడుల్లో 5,285 మంది మావోయిస్టులు చనిపోయినట్లు అంచనా. మూడున్నరేళ్లలో 475 మందిని కోల్పోయినట్లుగా మావోయిస్టులు పేర్కొంటున్నారు.
కాగా, దండకారణ్యంలో దశాబ్దకాలంగా ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల్లో తిరిగి పుంజుకునేందుకు మావోయిస్టులు తెలంగాణ వైపు అడుగులు వేస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఉద్యమం బలహీన పడక ముందే తెలంగాణలో బలమైన స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలని మావోయిస్టులు భావిస్తున్నారనే చర్చ జరుగుతోంది.
More Stories
కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసు దోషికి జీవిత ఖైదు
అక్రమ వలసదారులను తిప్పి పంపుతా
90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిన ఇజ్రాయెల్