జిఎస్టి కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరికి నోటీసులు ఇచ్చేందుకు సిఐడి అధికారులు సిద్ధమవుతున్నారు. మొదట ఈ కేసు దర్యాప్తును హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు చేపట్టారు. కేసు తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ కేసును సిఐడికి అప్పగించింది.
సిసిఎస్ నుంచి ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసిన సిఐడి అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా సిఐడి అధికారులకు కీలక సమాచారం అందినట్లు తెలుస్తోంది.
ఈ సమాచారం మేరకే మాజీ సిఎస్ సోమేశ్ కుమార్ సహా నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్వీస్ టాక్స్ అదనపు కమిషనర్ ఎస్వి కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరామ ప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు, ఫ్లియాంటో టెక్నాలజీస్ కంపెనీ నిర్వాహకులకు నోటీసులు అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
స్పెషల్ ఇనిషియేటివ్స్ వాట్సాప్ గ్రూపు ద్వారా సోమేశ్ కుమార్ సర్వీస్ టాక్స్ అధికారులు విశ్వేశ్వరరావు, శివరామ ప్రసాద్, శోభన్ బాబులకు ఆదేశాలు ఇచ్చినట్లు సిఐడి అధికారులు ఆధారాలను సేకరించినట్లు చెబుతున్నారు. కమర్షియల్ టాక్స్ సెంట్రల్ కంప్యూటర్ వింగ్ జాయింట్ డైరెక్టర్ రవి కనూరి అందించిన ఆడిట్ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తును సిఐడి అధికారులు చేపట్టారు.
ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ సహా 75 కంపెనీలకు లబ్ధి చేసినట్లు ఆధారాలను సేకరించారు. ఈ కుంభకోణంతో ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.1000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు సిఐడి అధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.
More Stories
తెలంగాణకు రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులు
పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు
జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసం?