
పారిస్ ఒలింపిక్స్లో రెజ్లర్ వినేష్ అనర్హతపై అంతర్జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్ ముందు తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పార్లమెంట్లో తెలిపారు. రెండుసార్లు బరువు కొలిచినప్పుడు ఆమె 50.100 కిలోలుగా తేలిందని క్రీడా మంత్రి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ వినేష్ ఫోగట్ అంశానికి సంబంధించి భారత ఒలింపిక్ సంఘం చీఫ్ పిటి ఉషతో మాట్లాడి, తగిన చర్యలు తీసుకోవాలని సూచించారని ఆయన తెలిపారు.
వినేష్ ఫోగట్కు అన్ని రకాల సహాయ సహకారాలు అందించామని ఒలింపిక్ సంఘం తెలిపినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఆమె కోసం రూ. 70.45 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు వెల్లడించారు. వినేష్ ఫోగట్ రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో మంగళవారం జరిగిన సెమీఫైనల్స్లో క్యూబా క్రీడాకారిణి ఓడించి ఫైనల్స్కు చేరింది. అంతకుముందు టోక్యో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత సుసాకిని ఓడించి చరిత్ర సృష్టించింది.
ఫైనల్స్కు కొన్ని గంటల ముందు ఓ చేదు వార్త బయటకురావడంతో భారతీయులంతా నిరాశ చెందారు. వినేష్ ఫోగట్ బరువు ఎక్కువుగా ఉన్నారని తేలడంతో ఒలింపిక్స్ కమిటీ ఆమెపై అనర్హత వేటు వేయడంతో విశ్వ క్రీడల నుంచి ఆమె నిష్క్రమించాల్సి వచ్చింది.
రెజ్లింగ్లో తలపడే క్రీడాకారులకు ప్రతి రోజు ఉదయం బరువును పరిక్షీస్తారని, ఆ పరీక్షల్లో బరువు అధికంగా ఉన్నట్లు తేలడంతో వినేష్ ఫోగట్పై అనర్హత వేటు పడినట్లు కేంద్ర క్రీడల శాఖ మంత్రి తెలిపారు. 50 కిలోల విభాగంలో ఆమెను అనర్హురాలిగా ప్రకటించినట్లు చెప్పారు. ఉండాల్సిన బరువుకంటే 100 గ్రాములు అధికంగా ఉన్నట్లు గుర్తించారని పేర్కొన్నారు.
తన బరువును నిరూపించుకోవడంలో విఫలమైనా, బరువు పరీక్షకు ఆటగాడు హాజరుకాకపోయినా అతడిపై అనర్హత వేటు వేయడంతో పాటు ర్యాంకుల జాబితాలో దిగువకు చేరుస్తారని ఒలింపిక్ నిబంధనలు పేర్కొంటున్నాయని, దీని ప్రకారం వినేష్ ఫోగట్ పైనల్స్ ఆడలేకపోతున్నట్లు తెలిపారు. వినేష్ ఫోగట్కు ప్రభుత్వం అన్ని విధాల సహాయ, సహకారాలు అందిస్తోందని చెప్పారు. ఆమెకు క్రీడా సౌకర్యాలు కల్పించడంతో పాటు, అవసరమైన శిక్షణ ఇప్పించినట్లు కేంద్రమంత్రి ప్రకటించారు. పారిస్ ఒలింపిక్స్లో వినేష్ కోసం రూ.70,45,775 ఖర్చు చేసినట్లు తెలిపారు.
అయితే, కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటనపై విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఆమెపై అనర్హత వేటు పడిందని, తక్షణమే దీనిపై విచారణ చేయించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. కేంద్రమంత్రి ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విపక్షాలు లోక్సభ నుంచి వాకౌట్ చేశాయి.
More Stories
తెలంగాణలోని ఎనిమీ ప్రాపర్టీస్ పై మర్చిలోగా లెక్క తేల్చాలి
భారత్ కు అమెరికా ఎఫ్-25 ఫైటర్ జెట్ లు .. చైనా, పాక్ కలవరం
రేవంత్ కట్టడి కోసమే తెలంగాణకు మీనాక్షి నటరాజన్!