ఆంధ్రప్రదేశ్కు నిధులు కేటాయిస్తే తెలంగాణ కాంగ్రెస్కు బాధేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో సిరిసిల్ల, సిద్దిపేట నిధులు కేటాయించుకుంటే, ప్రస్తుతం రేవంత్ రెడ్డి కొడంగల్కు నిధులు కేటాయించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవడబ్బ సొమ్మని కేటాయించుకుంటారని ప్రశ్నించారు.
అసెంబ్లీలో ఇవాళ ఒక దుర్దినము అని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దివాలా తీసిన కాంగ్రెస్ పార్టీ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తోందని, కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని ఎద్దేవా చేశారు. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటుందని ఆరోపించారు. కేసీఆర్ అవాకులు చివాకులు మాట్లాడి పోయారని అందుకే అసెంబ్లీకి రావడానికి మొహం లేదన్నారు. ఇవాళ సభలో పెట్టిన తీర్మానం పనికిరానిది స్పష్టం చేశారు.

More Stories
మాతృ హస్త భోజనం.. అమ్మ ప్రేమ గోరుముద్దలతో ఆత్మీయ విందు
`మానస’లో ఆకట్టుకున్న ప్రత్యేక పిల్లల యోగా, హరిత కార్యక్రమాలు
యోగా కేవలం వ్యాయామం కాదు.. అది జీవన విధానం