
జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలోని తీర్థయాత్ర నుండి యాత్రికులను తీసుకెళ్తున్న బస్సుపై ఆదివారం ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో పది మంది మరణించారు. ఈ ఘటనలో మరో 33 మంది గాయపడ్డారు. ఉగ్రవాదుల జాడ కోసం పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ సెర్చ్ ఆపరేషన్ లో 11 భద్రతా దళాల బృందాలు పనిచేస్తున్నాయి.
కాగా, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ఆధారంగా ఉగ్రవాది స్కెచ్ను పోలీసులు విడుదల చేశారు. అతని గురించి సమాచారం అందించిన వారికి రూ.20లక్షల రివార్డును ప్రకటించారు. రియాసి ఎస్పీ- 9205571332, రియాసి ఏఎస్పీ- 9419113159, ఎస్హెచ్ఓ పౌని- 7051003214 ఫోన్ నంబర్లకు అతడి గురించి సమాచారం తెలిస్తే అందించాలని పోలీసులు సూచించారు.
దాడిలో గాయపడిన వ్యక్తుల వాంగ్మూలాల ఆధారంగా ఉగ్రవాదులపై నిఘా ఉంచినట్లు, ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు అధికారులు ప్రకటించారు. దాడి జరిగిన ప్రాంతానికి చుట్టుపక్కల సోదాలు కొనసాగుతున్నాయని, దాదాపు 20 మందికి పైగా వ్యక్తులను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
More Stories
కుంభమేళాలో పాల్గొన్న పాక్ హిందువులు
జమ్ముకశ్మీర్లో 12 మంది పాక్ చొరబాటుదారులు కాల్చివేత
ఢిల్లీలో బిజెపి సునామి.. యాక్సిస్ మై ఇండియా అంచనా