వ్యవసాయం గురించి అవగాహన లేని ఉత్తమ్ కుమార్ రెడ్డిని సివిల్ సప్లై మంత్రిగా పెట్టి రైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతుందని బీజేపీ ఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నానా రకాలుగా మోసం చేస్తోందని దుయ్యబట్టారు.
45 రోజులుగా పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలు, పిడుగు పాటుతో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 40 కిలోల బస్తాకు 3 నుంచి 4 కిలోల చొప్పున తరుగు తీస్తున్నారని, దీని వెనుక మాఫియా నడుస్తుందని ఆరోపించారు. ఈ మాఫియాను నడిపిస్తున్నది ఎవరని ప్రశ్నించారు.
ప్రభుత్వం 30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని తప్పుడు లెక్కలు చెబుతోందని విమర్శించారు. కల్లాల్లోని ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సన్నవడ్లతో పాటు దొడ్డువడ్లకు కూడా బోనస్ ఇవ్వాలని కోరారు. ప్రజలను మోసం చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించితే.. నేడు పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తయారైందని ధ్వజమెత్తారు.
రాత్రింబవళ్లు ధాన్యం కుప్పల దగ్గర కాపలా కాస్తూ రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అకాల వర్షాలతో తిప్పలుపడుతున్నారని, కొందరు పిడుగుపాటుతో మరణించిన ఘటనలు జరిగాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాలు, తేమ పేరుతో బస్తాకు 4 కిలోల చొప్పున తరుగు తీస్తూ గత ప్రభుత్వం తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు.
40 కిలోల బస్తాకు 3 నుంచి 4 కిలోల చొప్పున తరుగు తీస్తున్నారని చెప్పారు. క్వాంటా చేసిన ధాన్యానికి రసీదు ఇవ్వాలని, కాని, రైస్ మిల్లులకు పోయిన ధాన్యానికి సైతం రైస్ మిల్లర్లు 3 కిలోల చొప్పున తరుగు తీస్తున్నారని పేర్కొంటూ రాష్ట్రంలో ఈ మాఫియాను నడిపిస్తున్నది ఎవరు..? అని ప్రశ్నించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి రైతుల సమస్యల గురించి తీసుకెళ్లినా దీనిపై స్పందించడం లేదని మండిపడ్డారు.
నిన్నమొన్నటిదాకా ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు సన్నబియ్యానికి మాత్రమే బోనస్ ఇస్తామంటూ బోగస్ మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ నేత విమర్శించారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన రైతుబంధును సైతం ఇప్పటి ప్రభుత్వం నేటి వరకు ఇవ్వలేదని, మరోవైపు కేవలం 5 ఎకరాల వరకు మాత్రమే రైతులకు రైతుబంధు ఇస్తామంటూ పరిమితులు పెట్టి లీకులు ఇస్తున్నారు.
రైతు దుక్కి దున్నడం నుంచి పంట చేతొకొచ్చే వరకు రైతులు అహర్నిశలు కష్టపడి ధాన్యాన్ని కాపాడుకుని కల్లాలకు తీసుకొస్తే.. కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. అకాల వర్షాలకు వరి ధాన్యం తడిసిపోయి రైతులు ధీనస్థితిలో పడిపోయారని చెబుతూ
రైతు రుణమాఫీ చేయలేదు.. రైతు కూలీలు, కౌలు రైతులకు రూ. 12 వేలు ఇవ్వలేదని ధ్వజమెత్తారు.
కొనుగోలు కేంద్రాల నుంచి కోట్లాది రూపాయలు లంచాల రూపంలో చేతులు మారుతున్నాయని బిజెపి నేత ఆరోపించారు. వ్యవసాయం గురించి అవగాహన లేని ఉత్తమ్ కుమార్ రెడ్డిని సివిల్ సప్లై మంత్రిగా పెట్టి రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు కష్టించి పండించిన ధాన్యాన్ని అనేక కండిషన్లకు అమ్ముకోవాల్సిన దుస్థితి రావడం బాధాకరం అని చెప్పారు.
ప్రభుత్వం ఇప్పటికైనా రూ.2 లక్షల రైతు రుణమాఫీ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించే వరకు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా బీజేపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
More Stories
రూ. 1 లక్ష కోట్లతో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తొలి బడ్జెట్
నాపై సెటైర్లు వేయడానికి కమ్రా సుపారి తీసుకున్నట్లుంది
కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకునే అవకాశం!