మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడం సరికాదని నడ్డా స్పష్టం చేశారు. ఆయా పార్టీల వారసుల కోసమే ఇండియా కూటమి ఏర్పాటు చేశారని, ఇండియా కూటమి నేతలు అనేక కుంభకోణాలకు పాల్పడ్డారని, అనేక మంది కూటమి నేతలు అవినీతి చేసి జైళ్లకు వెళ్లారని దుయ్యబట్టారు. బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కూతురు ఢిల్లీ మద్యం కేసు కుంభకోణంలో జైల్లో ఉన్నారని నడ్డా గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సంఘవ్యతిరేక శుక్తులన్నీ విజృంభిస్తాయని, కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా కుంభకోణాలు, అవినీతి కనపడుతోందని నడ్డా విమర్శలు గుప్పించారు.
“గిరిజనుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థను మోదీ 11 వ స్థానం నుంచి ఐదో స్థానానికి తీసుకవచ్చారు. రెండేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతోంది. మా పాలనలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు” అని నడ్డా తెలిపారు. “మేడిన్ ఇండియా ఔషధాలు ప్రపంచ దేశాలకు వెళ్తున్నాయి. ఒకప్పుడు ఫోన్లన్నీ మేడిన్ చైనా, కొరియా, జపాన్ అని ఉండేవి. మేకిన్ ఇండియా పేరుతో భారత్లోనే ఫోన్లు తయారవుతున్నాయి. 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇస్తున్నాం, మరో ఐదేళ్లు కొనసాగిస్తాం” అని స్పష్టం చేశారు.
“నాలుగు కోట్ల మందికి ఇళ్లు కటించి ఇచ్చాం, మరో మూడు కోట్ల ఇళ్లు కటిస్తాం. పిఎం మోదీ ఎప్పుడూ పేదలు రైతుల గురించే ఆలోచన చేస్తారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా 70 ఏళ్లు పైబడిన వారికీ చికిత్స అందించాం, భవిష్యత్తులో పైపులైను ద్వారా ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేస్తాం” అని జెపి నడ్డా తెలిపారు.
More Stories
హైదరాబాద్ లో బిజెపి ఓట్లు తొలగించారు
హైదరాబాద్ జూలో మగ తెల్లపులి మృత్యువాత
నిశ్శబ్ద విప్లవ ఫలితం జూన్ 4న తెలుస్తుంది