రాజంపేటను జిల్లా చేయకుండా ఇక్కడి వారికి సీఎం జగన్ రెడ్డి అన్యాయం చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. రాజంపేటలో గురువారం నాడు అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒకే వేదికపై చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డి, జనసేన అధినేత పవన్కల్యాణ్ ఆసీనులయ్యారు.
జగన్పై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని చంద్రబాబు చెబుతూ ఆరాచక శక్తులను ఉపేక్షించకూడదని పిలుపిచ్చారు. ఈ తిరుగుబాటు జగన్ను ఇంటికి పంపిస్తుందని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులకు డిపాజిట్లు రాకుండా చేయాలని పిలుపునిచ్చారు. కూటమిని గెలిపించాలని కోరారు. కూటమి అధికారంలోకి రాగానే రాజంపేటలో విజయోత్సవ సభ పెడతామని చెప్పారు. మీకు జగన్ న్యాయం చేశారా? అని ప్రశ్నించారు. బాధితులకు జగన్ కనీసం ఇళ్లు కట్టించారా? అని నిలదీశారు.
అన్నమయ్య డ్యామ్ కట్టించలేని సీఎం జగన్ మూడు రాజధానులు కడతాడరా? అని ప్రశ్నించారు. లక్ష్మీప్రసన్న కుటుంబానికి వైసీపీ అన్యాయం చేసిందని మండిపడ్డారు. వారి కుటుంబ ఆస్తులను వైసీపీ నేతలు లాక్కున్నారని ఆరోపించారు. లక్ష్మీ ప్రసన్న తండ్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె తల్లి, సోదరి విషం తాగి చనిపోయారని చంద్రబాబు పేర్కొన్నారు.
తాము అధికారంలోకి వచ్చాక అన్నమయ్య ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. వైసీపీ పాలనలో నిత్యావసరాల ధరలు బాగా పెరిగాయని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను జైలులో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పారని గుర్తుచేసుకున్నారు. ఓట్లు చీలకుండా ఏకతాటిపై ఉండాలని పవన్ ఆనాడు చెప్పారని తెలిపారు. ముస్లింలకు న్యాయం చేసిన పార్టీ తమదని తెలిపారు.
జగన్ 70 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. సారా వ్యాపారం చేసుకునే మిథున్రెడ్డి తనను ఓడిస్తారట అని విమర్శించారు. యువత తలుచుకుంటే మార్పు ఎందుకు రాదు? అని ప్రశ్నించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్రెడ్డిని ఎదుర్కొనే గుండెబలం యువతకు లేదా? అని నిలదీశారు.
అన్నమయ్య డ్యామ్ ప్రమాదంలో ఉందని ముందే జగన్ ప్రభుత్వాన్ని తాము హెచ్చరించామని గుర్తు చేశారు. డ్యామ్లో ఇసుక తవ్వేయడం వల్ల 39 మంది చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దామని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొద్దామని చెప్పారు. రాజ్యాధికారం కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉందని… ఇది మారాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
More Stories
రెండేళ్లలో పోలవరం పూర్తిచేస్తాం.. రాజధానిగా అమరావతి చేస్తాం
సీఎం రమేష్ అరెస్ట్.. కాన్వాయ్ పై వైసీపీ నేతల దాడి
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై దుష్ప్రచారం.. సిఐడి దర్యాప్తుకు ఈసీ ఆదేశం