2020లో ప్రపంచం మొత్తం మీద మహిళల్లో 75 ఏళ్ల వయసుకు ముందే సరాసరిన 12 మందిలో ఒకరు రొమ్ముక్యాన్సర్ బాధితులుగా గుర్తింపు కాగా, ఈ పరిస్థితి మరింత పెరుగుతోందని పరిశోధకులు తెలుసుకున్నారు. 2020లో 2.3 మిలియన్ మంది రొమ్ము క్యాన్సర్ రోగులుండగా, 2040 నాటికి తక్కువ ఆదాయం, మధ్యస్థ ఆదాయం దేశాలన్న తేడా లేకుండా 3 మిలియన్ కన్నా ఎక్కువ మంది వరకు పెరుగుతారని పరిశోధకులు అంచనా వేశారు.
2040 నాటికి ఏడాదికి మిలియన్ మంది ఈ వ్యాధితో చనిపోతారని హెచ్చరించారు. ఇదికాక మెటాలిస్టిక్ బ్రెస్ట్ క్యాన్సర్ మహిళలు కూడా అసంఖ్యాకంగా ఉన్నారని పేర్కొన్నారు. ఒక చోట నుంచి శరీరం లోని ఇతర భాగాలకు వ్యాపించే క్యాన్సర్ను మెటాలిస్టిక్ బ్రెస్ట్ క్యాన్సర్ అని అంటారు.
ఇటీవల కాలంలో ఆధునిక వైద్య ప్రక్రియల కారణంగా చాలావరకు రోగులు బతకగలుగుతున్నారని కమిషన్కు నాయకత్వం వహించిన , బ్రిటన్ లోని యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జికి చెందిన పరిశోధకులు చర్లోట్టె కోలెస్ వివరించారు. అత్యధిక ఆదాయ దేశాల్లో 40 శాతం వరకు ఈ మరణాలు తగ్గాయని తెలిపారు. కానీ దిగువ, మధ్య తరగతి దేశాల్లో మాత్రం బ్రెస్ట్ కేన్సర్ మృతుల సంఖ్య పెరుగుతున్నది. ఇండియాలో క్యాన్సర్ నుంచి బయటపడి బ్రతికే ఛాన్సు 66 శాతం ఉన్నట్లు అంచనా వేశారు.
More Stories
సప్తపదితో ముడిపడినదే హిందూ వివాహం
మే 4 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు
కొవిషీల్డ్ పై దర్యాప్తు కోరుతూ సుప్రీంలో పిటిషన్