దివ్యాంగుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. పదేండ్లలో 10 కోట్ల మంది స్వయం సహాయక సంఘాల్లో చేరారు. మహిళలు పారిశ్రామికవేత్తలు కావాలని ప్రోత్సహిస్తున్నాం. వచ్చే ఐదేండ్లలో 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేస్తాం. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం పెంచుతాం. భారత్ను గ్లోబల్ న్యూటిషన్ హబ్గా మారుస్తామని వివరించారు.
శ్రీ అన్న్ రకం పండించడం ద్వారా రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. సముద్ర నాచు, ముత్యాల సాగు దిశగా మత్స్యకారులను ప్రోత్సహిస్తాం. భారత్ను ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా మారుస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ వల్ల గ్రామాల ఆదాయం పెరుగుతుంది. నానో యూరియా వినియోగం మరింత పెంచుతాం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
బీజేపీ పాలనలో అభివృద్ధి, సంస్కృతికి రెండింటికీ ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. భారత్ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుస్తామని ప్రధాని తెలిపారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తే ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయని చెప్పారు. ఏజెన్సీల్లో పర్యాటకం ప్రోత్సహించి గిరిజనులకు మేలు చేస్తామని పేర్కొన్నారు.
‘సోషల్, డిజిటల్, ఫిజికల్ రంగాల్లో మౌలిక వసతులు పెంచుతాం. దేశంలో అనేకచోట్ల శాటిలైట్ పట్టనాలు నిర్మిస్తున్నాం. విమానయాన రంగాన్ని ప్రోత్సహించి లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాం. దేశంలో మూడు రకాల వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. త్వరలో వందే భారత్ స్లీపర్, వందే భారత్ మెట్రో రైళ్లు అందుబాటులోకివస్తాయి. దేశం నలుమూలలా బుల్లెట్ రైళ్లు తెస్తాం. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు మార్తం పూర్తికానుంది. దక్షిణ, ఉత్తర, తూర్పు వైపు కూడా బుల్లెట్ రైలు మార్గాలు వేస్తాం’ అని వివరించారు.
దేశంలో ఈవీ మార్కెట్ శరవేగంగా దూసుకెళ్తున్నది. ఈ పదేండ్లలో 17 లక్షల వాహానాలను అమ్ముడుపోయాయి. భారత్ను గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్, సెమీ కండక్టర్ హబ్గా మారుస్తాం. అంతరిక్షంలోనూ భారత్ సత్తా చాటుతున్నది. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తాం. దేశాభివృద్ధికి అవినీతి ఆటంకంగా నిలిచిందని’ ప్రధాని మోదీ తెలిపారు.
More Stories
ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్న మంత్రి
రాహుల్ గాంధీ `పాకిస్తాన్ అనుచరుడు’
బ్రిజ్ భూషణ్ సింగ్ కు బిజెపి సీట్ నిరాకరణ!