ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆమె చెప్పారు. మహిళలకు నెలకు 2500 ఇస్తామని చెప్పారు ఇచ్చారా అని ఆమె ప్రశ్నించారు .రూ్ 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు? నెలకు పెన్షన్ రూ.4000 ఇస్తామన్నారు ఇచ్చారా ? అని ఆమె ప్రశ్నించారు.
ఇంటికి 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇస్తామన్నారు ఇచ్చారని ఆమె ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపించారు.రైతు బరోస అమలు కాలేదు రూ.2 లక్షల రుణమాఫీ ఏమైందని ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని, మహిళలు ఉచిత బస్సు ప్రయాణంలో బస్సులు లేక కొట్టుకునే పరిస్థితిలు ఏర్పరిచారని ఆమె విమర్శించారు.
ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏం ముఖం పెట్టుకొని లోక్ సభ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని అరుణ ప్రశ్నించారు. దేశం కోసం జరుగుతున్న ఈ ఎన్నికల్లో మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని కావాలని ఈ దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని ఆమె చెప్పారు. పార్టీ గెలుపు కోసం పాటుపడాలని కోరారు.
దేశంలోని ప్రతి పేద కుటుంబానికి ఒకరికి ఐదు కేజీల బియ్యం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని ఆమె చెప్పారు. రానున్న మరో ఐదేళ్లపాటు రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఉచిత బియ్య అందజేస్తామని చెప్పారు. వికసిత భారత్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పని చేస్తున్నారని చెబుతూ దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు బిజెపి కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
More Stories
మొట్టమొదటిసారి ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు తీసేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే
హైదరాబాద్లో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీవర్షం
సికింద్రాబాద్లో పలు విభాగాల్లో అగ్నివీర్ ఎంపికలు