నరేంద్ర మోదీ 10 సంవత్సరాలు ప్రధానిగా, 12 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా మచ్చలేని నేత అని కొనియాడారు. ప్రజల కోసం ఈ రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం దేశ ప్రజల కోసం కృషి చేస్తున్న శ్రమజీవి అని, ప్రపంచ దేశాల్లో గర్వించదగ్గ వ్యక్తి మోదీ అని తెలిపారు. ఐదు ఇస్లామిక్ దేశాలలో ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు అందుకున్న వ్యక్తి మోదీ అని గుర్తు చేశారు.
విభజనతో ఆంధ్రప్రదేశ్కు నష్టం జరుగుతుందని మోదీ ముందే చెప్పారని పేర్కొంటూ గత ఐదు సంవత్సరాల నుంచి ఏపీ ఆర్థికంగా పూర్తిగా దివాలా తీసిందని ధ్వజమెత్తారు. ప్రతి నెల ఆర్బీఐ, కేంద్రం నుంచి అప్పు తీసుకోకపోతే రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారు. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్లడం కోసం తామంతా కలిశామని స్పష్టం చేశారు.
రాజంపేట పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో గల ప్రజలు తమకు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు. పెద్దిరెడ్డి కుటుంబం ఒక చిన్న కాంట్రాక్టర్గా ప్రారంభమై ప్రభుత్వం, రాజకీయాల్లో ఉంటూ… ప్రభుత్వాన్ని మోసం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారని కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 2019 నుంచి పాలు, మామిడిపండు వ్యాపారంతో ప్రజల నోరుకొట్టారని, ఇసుక, మద్యం, గనులు, భూములు కొల్లగొట్టి దోచేశారని ఆరోపించారు.
అడ్డు వచ్చిన వారిపై దొంగ పోలీసు కేసులు పెట్టి దౌర్జన్యకరమైన వాతావరణం సృష్టించారని, తిరుపతి ఉప ఎన్నిక సమయంలో 35 వేల దొంగ ఓటర్ కార్డులు సృష్టించారని విమర్శించారు. ప్రజా ప్రతినిధులు ఏమి చేయకూడదో అదే చేశారని దుయ్యబట్టారు. దీంతో కలెక్టర్లు పోలీసు అధికారులు సస్పెండ్ అయ్యారని గుర్తు చేశారు. ఈ అక్రమాలపై ఎలక్షన్ కమిషన్ సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
తీవ్రమైన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల్లో పోటీ చేయకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తిరుపతి సంఘటన ఎలక్షన్ కమిషన్కు చాలెంజ్ చేసే అంశమని తెలిపారు. దీనిపై ఎలక్షన్ కమిషన్ ఒక నిఘా పెట్టాలని, ఓటర్లకు సెక్యూరిటీ కల్పించి స్వేచ్ఛగా ఓటు వేసుకునే అవకాశం కల్పించాలని ఆయన కోరారు.
More Stories
‘అధిక సంతానం’ ముస్లింల గురించి కాదు.. పేదల గురించి
2029 వరకు ప్రధానిగా నరేంద్ర మోదీ
రాయలసీమ, పల్నాడు హింసపై గవర్నర్ కు కూటమి నేతల ఫిర్యాదు