అంతర్గత విషయాల్లో ఇలా జోక్యం చేసుకోవడం తగదని భారత్ మండిపడింది. కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా విదేశాగ శాఖ అధికార ప్రతినిధి స్పందించడంపై అమెరికా రాయబార కార్యాలయం డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బేనాకు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆమె బుధవారం సౌత్ బ్లాక్లోని విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చారు.
సుమారు 40 నిమిషాలపాటు ఈ సమావేశం కొనసాగగా ఆమె వద్ద భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ‘‘దౌత్య సంబంధాల్లో భాగంగా దేశాలు ఇతరుల సార్వభౌమాధికారం, అంతర్గత వ్యవహారాలను గౌరవించాలని మేం భావిస్తున్నాం. మరీ ముఖ్యంగా తోటి ప్రజాస్వామ్య దేశాల విషయంలో ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. లేదంటే సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది’’ అని అమెరికాకు భారత్ స్పష్టంగా చెప్పింది.
అంతేకాదు భారత న్యాయ ప్రక్రియలు స్వతంత్ర న్యాయవ్యవస్థపై ఆధారపడి ఉంటాయని, ఇందులో కచ్చితమైన, సమయానుకూల ఫలితాలు వస్తాయని పేర్కొంటూ దీనిపై అంచనాలు వేయడం సరికాదని భారత విదేశాంగ శాఖ తెలిపింది. అనవసరమైన ఆశయాలతో చేసే వ్యాఖ్యలు అనారోగ్యకరమైన పరిణామాలకు దారి తీస్తుందని హెచ్చరించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని, అంతర్గత వ్యవహారాలను ఆయా దేశాలు గౌరవించాలని, ఇక ప్రజాస్వామ్య దేశాల విషయంలో ఆ బాధ్యత మరింత ఎక్కువగా ఉండాలని, లేదంటే అనారోగ్యకరమైన పరిణామాలకు వ్యవహారం దారి తీస్తుందని విదేశాంగ శాఖ తన హెచ్చరికలో పేర్కొన్నది.
More Stories
ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడి రాజీనామా
ఇండియా కూటమి గెలిస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు
కేజ్రీవాల్ జైలులో పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు