ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలపై నాగపూర్ లో చర్చ

*15 నుండి మూడు రోజులపాటు నాగపూర్ లో అఖిల భారత ప్రతినిధి సభలు
 
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) గత 99 సంవత్సరాలుగా క్రియాశీలకంగా సామాజిక సంస్థగా పని చేస్తుంది. వచ్చే ఏడాది 2025 విజయదశమి నాడు సంఘాన్ని స్థాపించి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని కార్యాచరణ ప్రణాళికపై మార్చి 15, 16, 17 తేదీల్లో మూడు రోజులపాటు నాగ్‌పూర్‌లోని రేషింబాగ్‌లో స్మృతి భవన్ ప్రాంగణంలో అఖిల భారత ప్రతినిధి సభలలో మేధోమథనం జరగనుంది.
 
ఈ సమావేశంలో సంఘ్ కార్యచరణపై ముఖ్యంగా సంఘం శాఖలపై సమీక్ష ఉంటుంది. శతాబ్ది సంవత్సరానికి, సంఘ్ తన పనిని విస్తరించడానికి లక్ష శాఖలకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్  అంబేకర్ బుధవారం మీడియా సమావేశంలో తెలిపారు.
 
2018 తర్వాత దాదాపు 6 ఏళ్ల తర్వాత నాగ్‌పూర్‌లో ఈ ప్రాతినిధ్య సభ జరగడం గమనార్హం. ఈ సమావేశంలో దేశం మొత్తం నుండి 1529 మంది ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సమావేశంలో 32 సంఘ్ ప్రేరేపిత సంస్థలు, కొన్ని సమూహాల ప్రతినిధులు కూడా పాల్గొంటారు. వీరిలో రాష్ట్ర సేవికా సమితి ప్రధాన సంచాలకులు శాంతక్కా, విశ్వహిందూ పరిషత్‌కు చెందిన అలోక్ కుమార్ తదితరులు హాజరవుతారు.
,
అన్ని సంస్థలు దేశవ్యాప్తంగా జరుగుతున్న తమ కార్యక్రమాల గురించి, ఆయా ప్రాంతాల్లోని వివిధ సమస్యలు, వాటి పరిష్కారానికి చేస్తున్న ప్రయత్నాల గురించి తెలియజేస్తాయి. ఈ అంశాలపై చర్చ కూడా జరుగుతుంది. జనవరి 22న అయోధ్యలో శ్రీరామ్ లల్లాకు ప్రాణఃప్రతిష్ట జరగడం వల్ల దేశవ్యాప్తంగా ఉత్సాహం, ఆనంద వాతావరణం నెలకొంది.
 
ఈ చారిత్రక సంఘటన భారతీయ దృక్పథంలో చాలా ముఖ్యమైనది. దీనికి సంబంధించి ప్రతినిధుల సభలో తీసుకురానున్నారు. ఈ సమావేశంలో సంఘ్   సర్ కార్యవాహ ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని, దీనికి ముందు మొత్తం 11 క్షేత్ర  సంఘచాలక్ ల ఎన్నిక ప్రక్రియను కూడా పూర్తి చేయనున్నారని అంబేకర్ వివరించారు.
 సర్ సంఘచాలక్ జీ దేశవ్యాప్త పర్యటన ప్రణాళిక కూడా ఖరారు చేస్తారు. దీనితో పాటు సమాజ ప్రయోజనాల దృష్ట్యా శాశ్వత మార్పుల కోసం  చేపట్టిన పంచ పరివర్తన్ కార్యక్రమంపై లోతుగా చర్చలు జరుగుతాయి. ఈ ఐదు మార్పుల కింద సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధన్, పర్యావరణం, ‘స్వయం’ ఆధారిత వ్యవస్థ,  పౌరుల కర్తవ్యాలను చేర్చడం జరిగింది.
 
ఈ సంవత్సరం మహారాణి అహల్యా బాయి హోల్కర్ (1725 మే 31 – 1795 ఆగస్టు 13) జన్మ ద్విశతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటారు. కొత్త పాఠ్యాంశాలతో పాటు నిర్వహించే సంఘ్ శిక్షా వర్గలపై కూడా ప్రతినిధుల సభలో చర్చించనున్నారు. పశ్చిమ క్షేత్ర సంఘచాలక్ డాక్టర్ జయంతిభాయ్ భదాసియా, సహా ప్రచార ప్రముఖ్ లు నరేంద్రకుమార్, అలోక్ కుమార్ కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.