కొత్త ఓట‌ర్లు పోలింగ్​లో పాల్గొనండి

 
* చివ‌రి మ‌న్ కీ బాత్ లో ప్ర‌ధాని పిలుపు
 
కొద్ది రోజుల క్రితం ఎన్నికల సంఘం ‘మేరా పెహ్లా ఓట్ – దేశ్ కే లియే’ అనే ప్రచారాన్ని ప్రారంభించింద‌ని, మొదటి సారి ఓటర్లు రికార్డు సంఖ్యలో ఓటు వేయాలని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ పిలుపునిచ్చారు. ప్రధానిగా మోదీ రెండోసారి పదవీకాలంలో ఆదివారం చివ‌రి మన్ కీ బాత్ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ, వ్యక్తుల నైపుణ్యాలు , ప్రతిభను ప్రదర్శించడంలో సోషల్ మీడియా చాలా సహాయపడుతోందని తెలిపారు. భారతదేశంలోని యువకులు కంటెంట్ క్రియేషన్ రంగంలో అద్భుతాలు చేస్తున్నార‌ని ప్ర‌శంసించార. వారి ప్రతిభను గౌరవించేందుకు, నేషనల్ క్రియేటర్స్ అవార్డు ప్రారంభించామని చెప్పారు. ఇక‌ మార్చి 8వ తేదీన మనం ‘మహిళా దినోత్సవం’ జరుపుకోనున్నామ‌న అంటూ ఈ ప్రత్యేకమైన రోజున‌ దేశ అభివృద్ధి ప్రయాణంలో స్త్రీ శక్తి సహకారానికి సెల్యూట్ చేయ‌డ‌మే వారికి మ‌నం ఇచ్చే బ‌హుమ‌తి అని చెప్పారు. 

మహిళలకు సమాన అవకాశాలు లభించినప్పుడే ప్రపంచం అభివృద్ధి చెందుతుందని మహాకవి భారతియార్ అన్నార‌ని తెలిపారు. నేడు భారతదేశ మహిళా శక్తి అన్ని రంగాలలో పురోగతి యొక్క కొత్త శిఖరాలను తాకుతోందని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించిన, కృషి చేస్తున్న వారితో ప్రధాని ఈ సందర్భంగా సంభాషించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెలా చివరి ఆదివారం ఆకాశవాణిలో చేస్తున్న ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమానికి తాత్కాలిక విరామం ఇచ్చారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా మన్‌ కీ బాత్‌ కార్యక్రమం వచ్చే మూడు నెలలు ప్రసారం కాదని మోదీ స్వయంగా వెల్లడించారు. మన్‌ కీ బాత్‌ 110 ఎపిసోడ్‌లో మోదీ ఈ విషయాన్ని ప్రకటించారు.  ఆదివారం ఉదయం మోదీ మాట్లాడుతూ.. ‘లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వచ్చే మూడు నెలల పాటు మన్‌ కీ బాత్ ప్రసారాలు ఉండవు’ అని ప్రకటించారు. 

 
ఎన్నికల అనంతరం ఈ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘మన్‌ కీ బాత్‌ మూడు నెలల పాటు ఆగిపోవచ్చు. కానీ దేశం సాధించిన విజయాలు మాత్రం ఆగవు. అందువల్ల మన్‌ కీ బాత్‌ హ్యాష్‌ట్యాగ్‌తో సమాజం, దేశం సాధించిన విజయాలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ ఉండండి’ అని తన 110 ఎపిసోడ్‌లో మోదీ తెలిపారు. ఎన్నికల అనంతరం 111వ ఎపిసోడ్‌ ప్రసారం అవుతుందని వెల్లడించారు.