99 అభ్యర్థులతో మొదటి జాబితా ప్రకటించిన టిడిపి, జనసేన

2024 ఎన్నికల్లో పోటీ చేసే 99 మంది అభ్యర్థుల తొలి జాబితాను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌లిసి  శనివారం విడుదల చేశారు. అంతక ముందు జనసేన, టీడీపీ మధ్య ఎన్నికల పొత్తుపై చర్చలు జరిగాయి. రెండు పార్టీల మధ్య పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ సీట్లల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ అంగీకరించింది. ఈ నేపథ్యంలో రాష్ర్టంలో 94 అసెంబ్లీ సీట్లల్లో పోటీ చేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, 5 సీట్లలో పోటీ చేసే జనసేన అభ్యర్థుల పేర్లను వారిద్దరూ ప్రకటించారు.
 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన పార్టీతో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ ఉమ్మడి ఒప్పందం ఏపీ చరిత్రలోనే ఓ చారిత్రాత్మక దినంగా అభివర్ణించారు. రాష్ట విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్రాన్ని చక్కదిద్ది అభివృద్ధి చేసే క్రమంలోనే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలనలో తీవ్ర విఘాతం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్టం కోలుకోలేని స్థితికి దిగజారిందని, జరిగిన నష్టం ఒక వ్యక్తిది కాదని, అయిదు కోట్ల మంది ప్రజలకు నష్టం క‌లిగింద‌ని చెప్పారు.
 
ఏపీని‌ అభివృద్ధి పథంలో నడిపించాలని, రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం టీడీపీ, జనసేన కలిశాయని పవన్ కల్యాణ్ తెలిపారు.  పొత్తుకు బీజేపీ ఆశీస్సులు కూడా ఉన్నాయని వెల్లడించారు.  వైసీపీ విముక్త ఏపీ కోసం తామంతా కలిసి పని చేస్తామని పవన్ స్పష్టం చేశారు. బీజేపీ కోసం తన సీట్లను తగ్గించుకున్నానని పవన్ వెల్లడించారు.
 
అభ్యర్థుల ఎంపికలోనూ రాజకీయంగా తీవ్ర కసరత్తు చేశామని, మంచి అభ్యర్థులను ఎంపిక చేయటంలో క్షుణ్ణంగా పరిశీలించామని చంద్రబాబు చెప్పారు. కోటి పది లక్షల మంది ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించామని, ప్రజలు, కార్యకర్తల మనోస్థితిని నమ్మి, సరైన సమాచారంతో అన్ని కోణాలు విశ్లేషించి అభ్యర్థులను ఎంపిక చేశామని తెలిపారు.
 
ఇరు పార్టీలకు కూడా ఎక్కువగా కొత్త అభ్యర్థులకు, యువకులకు, బీసీ, ఎస్సీ, మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇచ్చారు.  రెండు పార్టీలు కలిపి 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా…. అందులో 30 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 63 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ముగ్గురు ఎంబీబీఎస్ లు, ఇద్దరు పీహెచ్ డీ స్కాలర్లు, ఒక ఐఏఎస్ కూడా ఉన్నారు. 13 మంది మహిళలకు అవకాశం ఇచ్చారు.
జనసేన అభ్యర్థులు(5)
నెల్లిమర్ల – లోకం మాధవి, అనకాపల్లి – కొణతాల రామకృష్ణ, రాజానగరం – బత్తుల బలరామ కృష్ణ, కాకినాడ రూరల్ – పంతం నానాజీ, తెనాలి – నాదెండ్ల మనోహర్.

టీడీపీ అభ్యర్థులు (94)

 ఇచ్ఛాపురం- బెందాళం అశోక్, టెక్కలి- కింజరాపు అచ్చెన్నాయుడు, ఆమదాలవలస- కూన రవికుమార్, రాజం (ఎస్సి)- కొండ్రు మురళీ మోహన్, కురుపాం (ఎస్టీ) – తొయ్యక జగదేశ్వరి, పార్వతీపురం (ఎస్సి)- విజయ్ బోనెల సాలూరు (ఎసి) -గుమ్మడి సంధ్యారాణి, బొబ్బిలి- ఆర్ఎస్ వికెకె  రంగారావు (బేబీ నయన), గజపతినగరం- కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం- పుష్పతి అదితి విజయలక్ష్మి గజపతిరాజు.  
విశాఖపట్నం తూర్పు- వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖపట్నం పశ్చిమ-పీజీవీఆర్ నాయుడు (గన్నబాబు), అరకు లోయ (ఎస్టీ)- సియ్యారి దొన్ను దొర, పాయకరావుపేట (ఎస్సి)- వంగలపూడి అనిత, నర్సీపట్నం- చింతకాయల అయ్యన్నపాత్రుడు, తుని- యనమల దివ్య, పెద్దాపురం- నిమ్మకాయల చిన్నరాజప్ప, అనపర్తి- నల్లిమిల్లి రామకృష్ణా రెడ్డి, ముమ్మిడివరం – దాట్ల సుబ్బరాజు, గన్నవరం (ఎస్సి)- సరిపెల్ల రాజేష్ కుమార్.
కొత్తపేట- బండారు సత్యానందరావు, మండపేట- వేగుళ్ల జోగేశ్వరరావు, రాజమండ్రి సిటీ- ఆదిరెడ్డి వాసు, జగ్గంపేట-జ్యోతుల వెంకటప్ప రావు (నెహ్రు), ఆచంట -పితాని సత్యనారాయణ, పాలకొల్లు- నిమ్మల రామానాయుడు, ఉండి – మంతెన రామరాజు, తణుకు- ఆరిమిల్లి రాధాకృష్ణ,  ఏలూరు – బడేటి రాధా కృష్ణ, చింతలపూడి (ఎస్సి) – సొంగ రోషన్, తిరువూరు (ఎస్సి) – కొలికపూడి శ్రీనివాస్. 
నూజివీడు – కొలుసు పార్ధసారధి,  గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ – వెనిగండ్ల రాము, పెడన – కాగిత కృష్ణ ప్రసాద్, మచిలీపట్నం- కొల్లు రవీంద్ర, పామర్రు (ఎస్సి)- వర్ల కుమార రాజా, విజయవాడ సెంట్రల్- బోండా ఉమ, విజయవాడ తూర్పు- గద్దె రామ్మోహనరావు, నందిగామ (ఎస్సి)- తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట -శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, తాడికొండ (ఎస్సి) – తెనాలి శ్రావణ్ కుమార్.
మంగళగిరి – నారా లోకేష్, పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ర, వేమూరు (ఎస్సి)- నక్కా ఆనంద్ బాబు, రేపల్లె – అనగాని సత్య ప్రసాద్, బాపట్ల- వేగేశ్న నరేంద్ర వర్మ, ప్రత్తిపాడు (ఎస్సి)- బర్ల రామాంజనేయులు, చిలకలూరిపేట- ప్రత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి – కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ – జీవీ ఆంజనేయులు, మాచర్ల- జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, యర్రగొండపాలెం (ఎస్సీ)- గూడూరి ఎరిక్షన్ బాబు, పర్చూరు- ఏలూరి సాంబశివరావు.
అద్దంకి- గొట్టిపాటి రవికుమార్, సంతనూతలపాడు- బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్, ఒంగోలు- దామచర్ల జనార్దనరావు, కొండపి- డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కనిగిరి – ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, కావలి- కావ్య కృష్ణా రెడ్డి, నెల్లూరు నగరం- పి.నారాయణ, నెల్లూరు రూరల్- కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు (ఎస్సి) – పాసం సునీల్ కుమార్, సూళ్లూరుపేట (ఎస్సీ) నెలవెల విజయశ్రీ, ఉదయగిరి -కాకర్ల సురేష్.  
కడప – మాధవి రెడ్డి, రాయచోటి- మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, పులివెందుల- మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, మైదుకూరు – పుట్టా సుధాకర్ యాదవ్, ఆళ్లగడ్డ – భూమా అఖిలప్రియ రెడ్డి, శ్రీశైలం- బుడ్డ రాజశేఖర్ రెడ్డి, కర్,నూలు- టిజి భరత్, పాణ్యం – -గౌరు చరిత రెడ్డి,  నంద్యాల- మహమ్మద్ ఫరూఖ్, బనగానపల్లె – బీసీ జనార్దన్ రెడ్డి, పత్తికొండ- కేఈ శ్యామ్ బాబు, కోడుమూరు- బొగ్గుల దస్తగిరి.
రాయదుర్గం- కాల్వ శ్రీనివాసులు, ఉరవకొండ – పి.కేశవ్, తాడిపత్రి- జె. సి . అశ్మిత్ రెడ్డి, సింగనమల (ఎస్సి) – -బండారు శ్రావణి శ్రీ, కళ్యాణదుర్గం – అమిలినేని సురేందర్ బాబు, రాప్తాడు – పరిటాల సునీత, మడకశిర (ఎస్సి) – ఎం ఈ  సునీల్ కుమార్, హిందూపూర్- నందమూరి బాలకృష్ణ, పెనుకొండ – సవిత, తంబళ్లపల్లె – జయచంద్రారెడ్డి, పీలేరు – నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, నగరి – గాలి భాను ప్రకాష్, గంగాధర నెల్లూరు- డాక్టర్ వి ఎం థామస్, – గురజాల జగన్ మోహన్, పలమనేరు- ఎన్.అమరనాథ్ రెడ్డి, కుప్పం- నారా చంద్రబాబు నాయుడు.