టీజీ వెంకటేష్ , విజయసాయిరెడ్డిలకు సంసద్ మహారత్న అవార్డు

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ లుగా అద్భుతమైన పనితీరును కనబర్చిన వారికి ఇచ్చే ప్రతిష్టాత్మకమైన 14 వ సంసద్ మహారత్న అవార్డును ఎంపి విజయసాయి రెడ్డి , రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందుకున్నారు. రాజ్యసభ సభ్యులుగా ఉన్న సమయంలో టీజీ వెంకటేష్ రవాణా , పర్యాటకం, జాతీయ రహదారులు, పౌర విమానయానం, రైల్వే భద్రత, సాంస్కృతిక శాఖలకు సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా వ్యవహరించారు.
 ఈ ఆరు శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కనబరిచిన అత్యుత్తమ పనితీరుకు అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ క్రమంలోనే ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ అనే సంస్థ 2019 నుంచి 2022 వరకు ఈ ఆరు శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా అత్యుత్తమ సేవలందించిన వెంకటేష్ కు సంసద్ మహారత్న అవార్డును ప్రకటించింది.

2022 -23 సంవత్సరానికి సంబంధించిన ఈ అవార్డును కొత్త ఢిల్లీలోని న్యూ మహారాష్ట్ర సదన్ లో జరిగిన కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ తమిళ సై సౌందర రాజన్, పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల మీదుగా ఇదే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రస్తుత చైర్మన్ ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి శనివారం నాడు టీజీ వెంకటేష్ అందుకున్నారు అవార్డు అందుకున్న వెంకటేష్ కు పలువురు ప్రజాప్రతినిధులతో పాటు రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు.