శనివారం జరిగిన సెమీస్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. డబుల్స్లో పుల్లెల గాయత్రి- ట్రీసా జాలీ సింగిల్స్లో అస్మిత, అన్మోల్ సంచలన విజయాలతో జట్టును ఫైనల్కు చేర్చారు. తొలుత జరిగిన సింగిల్స్లో పీవీ సింధు 13-21, 20-22తో అయా ఒహోరీ చేతిలో ఓటమిపాలైంది.
ఆ తర్వాత డబుల్స్లో గాయత్రి గోపీచంద్, త్రిసాజాలీ జోడీ 21-17,16-21, 22-20తో ప్రపంచ ఆరో ర్యాంక్ ద్వయం నమి మత్సుయమ, చిహారు షిదాపై సంచలన విజయం సాధించింది. తమ(23వ ర్యాంక్) కంటే మెరుగైన ర్యాంక్లో ఉన్న వారిని గాయత్రి, త్రిసా మట్టికరిపించారు. మరో సింగిల్స్లో అశ్మిత 21-17, 21-14తో నజోమి ఒకుహరపై గెలువడంతో భారత్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది.
డబుల్స్లో సింధు, అశ్విని ద్వయం 14-21, 11-21తో రీనా మియురా, అయాకో సకురామోటో జోడీ చేతిలో ఓడటంతో స్కోరు 2-2తో సమమైంది. సింగిల్స్లో అన్మోల్ 21-14, 21-18తో నత్సుకిపై గెలిచి భారత్ను ఫైనల్ చేర్చడంలో కీలకమైంది. చైనా ప్లేయర్ నిదైరాను ఓడించి భారత్కు 3-2 ఆధిక్యం చరిత్రాత్మక విజయాన్ని అందించింది. దీంతో భారత బ్యాడ్మింటన్ టీమ్ ఫైనల్కు చేరింది.
More Stories
భారత్ కు బంగ్లాదేశ్ లో టి20 మహిళా క్రికెట్ సిరీస్
ఇజ్రాయిల్తో వాణిజ్యాన్ని నిలిపివేస్తున్న టర్కీ
ఉక్రెయిన్ పై రష్యా రసాయన ఆయుధాల ప్రయోగం!