ఆరు గ్యారెంటీలకు రూ. 53,196 కోట్లు కేటాయింపు

2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,75,891 కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.29,669 కోట్ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమ‌లుకు రూ. 53,196 కోట్లు ప్ర‌తిపాదించిన‌ట్లు మంత్రి పేర్కొన్నారు. 
 
ఈ కేటాయింపు ఒక ప్రాథ‌మిక అంచ‌నా ప్ర‌కారం మాత్ర‌మే అని, హామీల‌కు సంబంధించిన విధివిధానాల‌ను రూపొందించే ప‌ని ఇంకా కొన‌సాగుతున్నందున‌, అది పూర్త‌యిన వెంట‌నే అమ‌లుకు అవ‌స‌ర‌మైన పూర్తి నిధులు కేటాయిస్తాం అని విక్ర‌మార్క తెలిపారు. శాసన మండలిలో మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్‌ను చదివివినిపించారు.
 
ఎన్నిక‌ల ముందు ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణ‌మాఫీ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌బోతున్నామ‌ని తెలిపారు. రూ. 2 లక్ష‌ల రుణ‌మాఫీపై త్వ‌ర‌లోనే కార్యాచ‌ర‌ణ ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. రైతుబంధు నిబంధ‌న‌ల‌ను పునఃస‌మీక్ష చేసి నిజ‌మైన అర్హుల‌కు రైతు భ‌రోసా కింద ఎక‌రాకు రూ. 15 వేలు అందించేందుకు కృత‌నిశ్చ‌యంతో ఉన్నామ‌ని తెలిపా
 
రు. అదే విధంగా ప్ర‌ధాన మంత్రి ఫ‌స‌ల్ భీమా యోజ‌న కార్య‌క్ర‌మాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో పంట‌ల భీమా ప‌థ‌కాన్ని ప‌టిష్టంగా అమ‌లు చేయ‌బోతున్నామ‌ని తెలిపారు. రైతుబీమా ప‌థ‌కాన్ని కౌలు రైతుల‌కు కూడా అమ‌లు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామని చెప్పారు.  నాసిర‌కం విత్త‌నాల‌ను, న‌కిలీ విత్త‌నాల‌ను అరిక‌ట్టేందుకు త‌మ ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని చెబుతూ రైతుకు న‌ష్టం చేసే ఏ విత్త‌న వ్యాపారినీ కూడా త‌మ ప్ర‌భుత్వం ఉపేక్షించ‌ద‌ని హెచ్చరించారు. ఈ మేర‌కు త్వ‌ర‌లో ఒక నూత‌న విత్త‌న విధానం తీసుకురాబోతున్నామ‌ని భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు.
 
రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాల‌కు గృహ జ్యోతి ప‌థ‌కం కింద 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందించ‌బోతున్నామ‌ని ఆర్థిక భ‌ట్టి విక్ర‌మార్క వెల్లడించారు. ఈ ప‌థ‌కం అమ‌లుకు బ‌డ్జెట్‌లో రూ. 2,418 కోట్లు కేటాయించిన‌ట్లు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలోని ట్రాన్స్‌కో, డిస్క‌మ్‌ల‌కు రూ. 16,825 కోట్లు ప్ర‌తిపాదిస్తున్న‌ట్లు భ‌ట్టి తెలిపారు. రాష్ట్రంలోని రైతుల‌కు 24 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్‌ను అందించ‌డానికి త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని భ‌ట్టి స్ప‌ష్టం చేశారు.
 
బడ్జెట్ స్వరూపం

రెవెన్యూ వ్య‌యం రూ. 2,01,178 కోట్లు
మూల‌ధ‌న వ్యయం రూ. 29,669 కోట్లు

నీటిపారుద‌ల శాఖ‌కు రూ. 28,024 కోట్లు
వ్య‌వ‌సాయ శాఖ‌కు రూ. 19,746 కోట్లు
విద్యారంగానికి రూ. 21,389 కోట్లు
వైద్యారోగ్య రంగానికి రూ. 11,500 కోట్లు

గృహ‌జ్యోతి ప‌థ‌కానికి రూ. 2,418 కోట్లు
ట్రాన్స్‌కో, డిస్క‌మ్‌ల‌కు రూ. 16,825 కోట్లు
గృహ నిర్మాణ శాఖ‌కు రూ. 7,740 కోట్లు

ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌కు రూ. 2,543 కోట్లు కేటాయింపు..
ఐటీ శాఖ‌కు రూ. 774 కోట్లు కేటాయింపు
పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌కు రూ. 40,080 కోట్లు
పుర‌పాల‌క శాఖ‌కు రూ. 11,692 కోట్లు
మూసీ న‌ది అభివృద్ధి కోసం రూ. 1000 కోట్లు

ఎస్సీ గురుకులాల భ‌వ‌న నిర్మాణాల‌కు రూ. 1000 కోట్లు
ఎస్టీ గురుకులాల భ‌వ‌న నిర్మాణాల‌కు రూ. 250 కోట్లు
ఎస్సీ సంక్షేమానికి రూ. 21,874 కోట్లు
ఎస్టీ సంక్షేమానికి రూ. 13,313 కోట్లు
మైనార్టీ సంక్షేమానికి రూ. 2,262 కోట్లు
బీసీ గురుకులాల స్వంత భ‌వ‌నాల నిర్మాణానికి రూ. 1,546 కోట్లు
బీసీ సంక్షేమానికి రూ. 8,000 కోట్లు