త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు దేశవ్యాపితంగా మొత్తం 96.88 కోట్ల మంది అర్హులుగా తేలారని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం వెల్లడించింది. 2024 సాధారణ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను తాజా పరిచింది. కచ్చితమైన ప్రణాళిక, సమన్వయం, రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.
తుది జాబితా ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఓటర్లు భారత్లో ఉన్నారు. 18, 29 ఏళ్ల మధ్య వయో వర్గంలో రెండు కోట్ల మందికి పైగా యువ వోటర్ల పేర్లను వోటర్ల జాబితాలో చేర్చినట్లు ఇసి తెలియజేసింది. చివరి సారిగా లోక్సభ ఎన్నికలు జరిగిన 2019లోని రిజిస్టర్ అయిన వోటర్ల సంఖ్య కన్నా ఇప్పుడు ఆరు శాతం పెరుగుదల నమోదైంది.
‘ప్రపంచంలోనే భారత్లో అత్యధిక సంఖ్యలో ఉన్న వోటర్లు 96.88 కోట్ల మంది రానున్న సార్వత్రిక ఎన్నికలలో వోటు వేయడానికి పేర్లు నమోదు చేసుకున్నారు’ అని ఇసి వివరించింది. లింగ దామాషా 2023లోని 940 నుంచి 2024లో 948కి పెరిగిందని ఇసి తెలిపింది. వోటర్ల జాబితాల సవరణలో పారదర్శకత, వివరాల వెల్లడితో పాటు జాబితాల స్వచ్ఛత, లోపరహితానికి కమిషన్ ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిందని కమిషన్ అధికారి ఒకరు తెలిపారు.
వోటర్ల జాబితాల సవరణకు సంబంధించ వివిధ బాధ్యతలు, ప్రతి దశలో రాజకీయ పార్టీల భాగస్వామ్యం గురించి ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పుణెలో విలేకరుల గోష్ఠిలో వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఓటింగ్ శాతం మరింత మెరుగుపడేలా చూసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.
More Stories
బస్తర్ ప్రాంతంలో 12 మంది నక్సల్స్ హతం!
ఓఎంఆర్ పద్ధతిలో నీట్ యూజీ 2025 పరీక్ష
శ్రీహరికోటలో మూడవ లాంచ్ప్యాడ్