
భారతదేశంలో రూపొందించిన క్యాన్సర్ నివారక కార్ టి సెల్ థెరపీ ప్రక్రియ సత్పలితాలు సాధించింది. ఈ థెరపీని వాడిన క్యాన్సర్ రోగి క్యాన్సర్ నుంచి విముక్తి పొందారు. ఈ ప్రక్రియను ఈ రోగికి తొలిసారిగా వాడి పరీక్షించారు. క్యాన్సర్ చికిత్సకు కార్ టి సెల్ చికిత్సను భారతీయ ఔషధ నియంత్రణ సంస్థ ఇటీవలే అనుమతించింది.
రోగిలోని క్యాన్సర్ కారక కణాలను జన్యుశాస్త్రవేత్తలు టి సెల్స్గా పరిగణిస్తారు. వీటినే చికిత్సకు వాడుకనే ప్రక్రియను కార్ టి థెరపీగా వ్యవహరిస్తారు. ఇది పూర్తిగా జన్యుపరమైన కణజాల చికిత్స ప్రక్రియగా ఉంది. రోగికి చెందిన స్వయం సిద్ధ సహజ రోగనిరోధక కణాలలోని శక్తిని వినియోగించుకని సాగేదే ఈ థెరపీ. ఇదంతా పూర్తిగా జన్యుకణ జాలపు ప్రభావిత అంశాల ప్రాతిపదికన సాగుతుంది.
ఈ చికిత్స ప్రక్రియకు భారత ఔషధనియంత్రణ మండలి వాణిజ్యపరమైన ఉత్పత్తి అనుమతిని ఇవ్వడం కీలక పరిణామం అయింది. మనిషిలోని రోగనిరోధక కణాలు అత్యంత శక్తివంతం అయినవి. వీటితోనే క్యాన్సర్ కారక కణాలను నివారించవచ్చునని తేలిందని నిర్థారించారు. ఢిల్లీకి చెందిన గాస్ట్రో ఎంట్రలాజిస్టు డాక్టర్ కల్నల్ వికె గుప్తా రూ 42 లక్షలు చెల్లించి ఈ చికిత్సను తన శరీరంలో తొలి ప్రయోగంగా నిర్వహింపచేశారు.
సాధారణంగా క్యాన్సర్ చికిత్సకు ఇతరత్రా ఈ రోగి విషయంలో రూ 4 కోట్ల వరకూ ఖర్చు అవుతుందని లెక్కలు కట్టారు. అయితే తక్కువ ఖర్చుతోనే ఈ రోగి నివారణ పొంది క్యాన్సర్ విముక్తి చెందారని వెల్లడైంది. టిసెల్స్ను జన్యుపరంగా పరివర్తనం చేయించి వీటిని వాడుకోవడం ద్వారా క్యాన్సర్పై విజయం సాధించడం ఇప్పుడు ఈ వ్యాధినివారణ క్రమంలో కీలక మలుపు అయింది. శరీరంలోని ఓ రకం తెల్లటి రక్తకణాలను టి సెల్స్గా పిలుస్తారు.
శరీరంలో వ్యాధి సోకడాన్ని ఇవి నివారిస్తాయి. ఇప్పుడు ఇండియన్ ఇనిస్టూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయి (ఐఐటిబి), టాటా మోమొరియల్ హాస్పిటల్ సంయుక్తంగా ఇమ్యూనోయాక్ట్ పద్ధతిలో ఈ నెక్స్కార్ 19 పేరిట వ్యవహరించే కణాల చికిత్స ప్రక్రియను రూపొందించింది. ఈ ప్రక్రియతో లూకేమిమా, లింఫోమా వంటి బి సెల్ క్యాన్సర్ను నివారించేందుకు వీలుంది.
More Stories
జగన్నాథుడి ఆలయ శిఖరంపై ముడిపడిన జెండాలు
ఓటుకు ఆధార్ లింక్పై 18న ఈసీ భేటీ
అమృత్సర్లో గుడిపై గ్రేనేడ్ దాడి