`గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఒప్పందం’ అనే పేరిట అందరినీ చంద్రబాబు ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని ఏపీ సీఐడీ తన చార్జిషీట్లో వెల్లడించింది. ప్రభుత్వం 2 ప్రభుత్వం ఒప్పందమేమీ జరుగలేదని నిర్ధారించింది. అసలు సింగపూర్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించలేదని స్పష్టం చేసింది.
మాస్టర్ ప్లాన్ పేరిట చట్ట విరుద్ధంగా సుర్బానా జురాంగ్ సంస్థకు డబ్బు చెల్లించారని నిర్ధారణకు వచ్చింది. నిందితులకు మేలు చేసేలా ఇన్నర్ రింగ్ రోడ్డు, సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్లు రూపొందించారని తన చార్జిషీట్ లో వివరించింది. లింగమనేని బ్రదర్స్ భూములు, హెరిటేజ్ భూములు, నారాయణ భూములకు అనుగుణంగా ఇన్నర్ రింగ్ రోడ్డు మాస్టర్ ప్లాన్ మార్చారని తెలిపింది.
ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలో మాజీ మంత్రి నారాయణ తన బంధువుల పేరిట 58 ఎకరాలు కొనుగోలు చేశారు. లింగమనేని 340 ఎకరాల ల్యాండ్ బ్యాంకుకు మేలు చేసే విధంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో మార్పులు చేర్పులు చేశారు. లింగమనేని తన ఇంటిని చంద్రబాబుకు ఇచ్చారని సీఐడీ వివరించింది.
లింగమనేని ల్యాండ్ బ్యాంకు పక్కనే హెరిటేజ్ ఫుడ్స్ 14 ఎకరాల భూమి కొనుగోలు చేసిందని తెలిపింది. ఈ భూముల విలువ పెరిగేలా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్చేశారని నిర్ధారించినట్లు సీఐడీ తెలిపింది.
More Stories
రెండేళ్లలో పోలవరం పూర్తిచేస్తాం.. రాజధానిగా అమరావతి చేస్తాం
సీఎం రమేష్ అరెస్ట్.. కాన్వాయ్ పై వైసీపీ నేతల దాడి
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై దుష్ప్రచారం.. సిఐడి దర్యాప్తుకు ఈసీ ఆదేశం