115 దేశాలకు చెందిన క్యాన్సర్ రిపోర్టును డబ్ల్యూహెచ్వో రిలీజ్ చేసింది. కేవలం 39 శాతం దేశాలు మాత్రమే క్యాన్సర్ చికిత్స గురించి అవగాహన కల్పిస్తున్నట్లు ఆ రిపోర్టులో వెల్లడించారు. మహిళల్లో నమోదవుతున్న అత్యధిక కేసుల్లో రెండో స్థానంలో రొమ్ము క్యాన్సర్ (11.6 శాతం) ఉన్నప్పటికీ, దానివల్ల మరణాల ముప్పు (7 శాతమే) తక్కువగా ఉందని వివరించింది.
అలాగే ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో ఎక్కువగా నమోదవుతున్న క్యాన్సర్లలో ఎనిమిదో స్థానంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఉందని, క్యాన్సర్ మరణాల్లో 9వ స్థానంలో ఉందని వెల్లడించింది. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏటా 3.5 కోట్ల క్యాన్సర్ కేసులు నమోదు అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. క్యాన్సర్ కేసుల పెరుగుదల సామాజిక ఆర్థికాభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు డబ్ల్యూహెచ్వో వెల్లడించింది. సర్వైకల్ క్యాన్సర్ ఎలిమినేషన్ ఇనిషియేటివ్ ప్రొగ్రామ్ ద్వారా గర్భాశయ క్యాన్సర్ను నిర్మూలించవచ్చని డబ్ల్యూహెచ్వో అభిప్రాయపడింది. కాగా. మనదేశంలో 2023 సంవత్సరంలో 3.4 లక్షలకు పైగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కేసులు నమోదైనట్టు భారత వైద్య పరిశోధన మండలికి చెందిన జాతీయ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ తెలిపింది.
ఈ విషయాన్ని కేంద్రం శుక్రవారం లోక్సభలో వెల్లడించింది. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సాంకేతిక ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్టు కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ తెలిపారు.
More Stories
పూంచ్లో ఉగ్రవాదుల కోసం భారీగా గాలింపు
జమ్మూకాశ్మీర్లో భారీ ఉగ్రదాడి.. ఎయిర్ఫోర్స్ కాన్వాయ్పై కాల్పులు
వన్డేలు, టీ20లో అగ్రస్థానంలో టీమ్ఇండియా