ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశంలో గుటెరస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘పాలస్తీనా ప్రజల స్వతంత్ర దేశ ఏర్పాటు హక్కును ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిందే. రెండు దేశాల ఏర్పాటు పరిష్కారాన్ని ఎవరు అంగీకరించకపోయినా ఆ నిర్ణయాన్ని తిరస్కరించాల్సిందే. ఎలాంటి స్వతంత్రం, హక్కులు, గౌరవం లేకుండా అంతమంది పాలస్తీనా ప్రజలు ఒక ప్రాంతంలో ఉండటం అసలు ఊహించలేం’ అని గుటెరస్ స్పష్టం చేశారు.
సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న హమాస్ మిలిటెంట్లు- ఇజ్రాయెల్ సేనల ఘర్షణలు ప్రాంతీయంగా అల్లకల్లోలానికి దారితీస్తాయనే అంచనాలు నిజమవుతున్నాయని గుటెరస్ ఆందోళన వ్యక్తంచేశారు. అందుకు ఇటీవల లెబనాన్, యెమెన్, సిరియా, ఇరాక్, పాకిస్థాన్ దేశాల్లో జరిగిన దాడులను ఆయన ఉదహరించారు. ఇరు పక్షాలు వెంటనే కాల్పుల విరమణ పాటించాలని సూచించారు.
అయితే, గుటెరస్ కాల్పుల విరమణ పిలుపును ఐరాసలోని ఇజ్రాయెల్ రాయబారి గిలద్ ఎర్డన్ తిరస్కరించారు. 2023 అక్టోబర్ 7న తమపై అత్యంత క్రూరంగా దాడి చేసిన హమాస్పై పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఏమాత్రం వెనక్కి తగ్గినా హమాస్ మిలిటెంట్లు మరింత రెచ్చిపోయి దాడులకు తెగబడతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వివాదానికి మూలం ఇరాన్లోనే ఉందని పేర్కొంటూ హమాస్, హెజ్బొల్లా, హౌతీలకు ఆ దేశమే ఆయుధాలు సరఫరా చేస్తోందని ఆరోపించారు.
More Stories
ఉక్రెయిన్ పై రష్యా రసాయన ఆయుధాల ప్రయోగం!
విదేశీ విద్యార్థులకు కెనడా వారానికి 24 గంటలే వర్క్ పర్మిట్
ఆఫ్ఘన్ షియా మసీదులో కాల్పులు.. ఆరుగురు మృతి