కల్లుగీత కార్మికుల లైసెన్సుల కోసం లంచం తీసుకుంటూ జడ్చర్ల ఎక్సైజ్ సీఐ రాత్నావత్ బాలోజీ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం పోతులమడుగు గ్రామానికి చెందిన గౌడ కులస్థులు టీఎఫ్టీ లైసెన్సు కోసం జనవరి 17న దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తును జడ్చర్ల ఎక్సైజ్ సీఐ కార్యాలయానికి పంపించడంతో 18న బాధితులు సీఐ బాలోజీని కలిశారు.
లైసెన్సు కావాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలని బాలోజీ డిమాండు చేయగా, రూ. 90 వేలకు డీల్ కుదిరింది. ఇక అదే రోజు రూ. 25 వేలు కూడా ఇచ్చారు. మిగతా డబ్బు ఇచ్చే సమయంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించటంతో ప్లాన్ ప్రకారం రెడ్ హ్యాండెడ్గా సీఐని అధికారులు పట్టుకున్నారు. ఇక ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రమేష్ వైట్ల అనే జర్నలిస్టు ఏసీబీ రాకింగ్ అంటూ సీవీ ఆనంద్ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్కు స్పందిస్తూ తెలంగాణలో రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖలతో పాటు ఎక్సైజ్ శాఖలో కూడా అవినీతి తీవ్రస్థాయిలో పెరిగిపోయిందంటూ సమాధానం ఇచ్చారు. కాగా, సీవీ ఆనంద్ లాంటి ఐపీఎస్ ఇలా బహిరంగంగానే ప్రభుత్వ శాఖలపై ఇలాంటి కామెంట్ చేయటం అందరినీ విస్మయ పరుస్తోంది. అందులోనూ. ఆయన పని చేసిన పోలీస్ శాఖ కూడా ఉందని పేర్కొనటం గమనార్హం.
More Stories
దేశంలోనే సుసంపన్న రాష్ట్రం తెలంగాణ
ఇన్కాయిస్కు సుభాష్ చంద్ర బోస్ పురస్కారం
20 మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం?