అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో ఈనెల 22న శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట నేపధ్యంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ అయోధ్యలో జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. రామాలయ ప్రారంభోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమవుతోందని, ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారని సీఎం యోగి సంతృప్తి వ్యక్తం చేశారు.
ట్రాఫిక్ పర్యవేక్షణ, భద్రత, రామ్ జన్మభూమి తీర్ధ్ క్షేత్ర ట్రస్ట్తో సమన్వయం వంటి విషయాల్లో అధికారులు, మంత్రులు సరైన రీతిలో వ్యవహరిస్తున్నారని ప్రశంసించారు. వేడుక అనంతరం కూడా అయోధ్య రాముడి దర్శనానికి భక్తులకు సకల సదుపాయాలు కల్పించే విషయంలో ట్రస్ట్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు.
ఈ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా, దైవిక కార్యక్రమంగా చరిత్రలో నిలిచేలా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారని, ఏర్పాట్లన్నీ తుది దశకు చేరుకున్నాయని యోగి ఆదిత్యానాధ్ వివరించారు. భక్తులు పూర్తిగా సహకరించి రాముడి దర్శనం చేసుకోవాలని ఆయన సూచించారు. టెంట్ సిటీ, ధర్మశాల, హోటల్ వంటి నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు.
లక్నో, ప్రయాగ్రాజ్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణీకులకు మెరుగైన గ్రీన్ కారిడార్ సిద్ధమైందని సీఎం తెలిపారు. చలిలో దూర ప్రాంతాల నుంచి ప్రజలు అయోధ్యకు కాలినడకన రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. రవాణా సౌకర్యాలను వినియోగించుకుని సౌకర్యవంతంగా ప్రయాణించాలని కోరారు.
అయోధ్యకు చేరుకున్న హైదరాబాదీ లడ్డూ
More Stories
రాహుల్ గాంధీ `పాకిస్తాన్ అనుచరుడు’
బ్రిజ్ భూషణ్ సింగ్ కు బిజెపి సీట్ నిరాకరణ!
అయోధ్య రామమందిరంలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు