అంటే, డిస్కంల వ్యయానికి, వచ్చే ఆదాయానికి మధ్యన ఎలాంటి తేడా ఉండకూడదన్నమాట. అలా జరగాలంటే తమ వ్యయానికి అయ్యే మొత్తాన్ని విద్యుత్తు చార్జీల రూపంలో వసూలు చేసుకొనేలా ఈఆర్సీలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఒకవేళ విద్యుత్తు ఉత్పత్తి కంపెనీలకు చెల్లించాల్సిన సొమ్మును గడువులోగా డిస్కంలు చెల్లించకపోతే అవి విధించే లేట్ పేమెంట్ సర్చార్జీతోపాటు, ఆదాయ వ్యత్యాసాన్ని కూడా కలిపి వచ్చే మూడేండ్లలో మూడు సమ వాయిదాల్లో వసూలు చేసుకోవచ్చని తాజా నిబంధనల్లో స్పష్టం చేశారు.
ఈ గెజిట్ అమల్లోకి రాకముందు ఉన్న ఆదాయ వ్యత్యాసాలు, లేట్ పేమెంట్ సర్చార్జీలను వచ్చే ఏడేండ్లలో ఏడు సమ వాయిదాల్లో వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవాలని అందులో స్పష్టం చేశారు. దీనితోపాటు, ఏదైనా విద్యుత్తు ఉత్పత్తి కంపెనీ/కాప్టివ్ విద్యుత్తు ప్లాంటు/ఎనర్జీ స్టోరేజీ వ్యవస్థ తమ అవసరాల కోసం ప్రత్యేక ట్రాన్స్మిషన్ లైన్లను ఏర్పాటు చేసుకొనేందుకు, నిర్వహణ, గ్రిడ్తో అనుసంధానం కోసం ప్రత్యేకంగా లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని తాజా గెజిట్లో పేర్కొన్నారు.
అయితే వాటి సామర్థ్యం అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ వ్యవస్థ పరిధిలో 25 మెగావాట్లు, రాష్ట్ర అంతర్గత ట్రాన్స్మిషన్ వ్యవస్థ పరిధిలో 15 మెగావాట్లకు మించకూడకుండా ఉండాలి. ఇదంతా సాంకేతిక ప్రమాణాలు, మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం ఉంటుంది. అన్ని రకాల ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై విధించే అదనపు సర్చార్జీలు, డిస్కంలు కొనుగోలు చేసే విద్యుత్తుకు సంబంధించిన ఫిక్స్డ్ చార్జీలకు మించకుండా ఉండలని అందులో పొందుపర్చారు.
More Stories
ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్న మంత్రి
రజాకార్ల గుప్పిట్లో నుండి హైదరాబాద్ విముక్తికై బిజెపికి ఓటు
కర్ణాటకకు కుదిపేస్తున్న రేవణ్ణ సెక్స్ వీడియోలు