జ్ఞానవాపి మసీదులోని ‘వాజూఖానా’ ప్రాంతాన్ని పరిశుభ్రం చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. వాజూఖానా ప్రాంతంలో శివలింగం కనిపించడం, ఆ ప్రాంతం మొత్తం పరిశుభ్రంగా ఉండటంతో దానిని క్లీన్ చేసేందుకు అనుమతించాలంటూ హిందూ మహిళా పిటిషన్లరు కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేపీ పర్డివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై మంగళవారంనాడు విచారణ జరిపింది. సుప్రీంకోర్టు గత ఆదేశాలకు అనుగుణంగా వారణాసి జిల్లా సూపరింటెండెంట్ పర్యవేక్షణలో వాజూఖానా (రిజర్వాయర్)ను శుభ్రం చేసేందుకు కోర్టు అనుమతించింది.
సుప్రీంకోర్టు ఆదేశాలతో సుమారు రెండేళ్లుగా వాటర్ ట్యాంకుకు సీల్ వేసి ఉందని, ట్యాంకును శుభ్రం చేసేందుకు తాము కూడా సుముఖంగానే ఉన్నామని విచారణ సందర్భంగా జ్ఞానవాపి మసీదు మేనేజిమెంట్ కమిటీ అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేసింది. హిందూ మహిళా భక్తుల తరఫున న్యాయవాది విష్ణు శంకర్ జైన్ పిటిషన్ దాఖలు చేశారు.
హిందువులకు శివలింగ పవిత్రమైనదని, మురికి, దుమ్ము, చనిపోయిన జంతువులు తదితరాలకు దూరంగా ఉంచుతామని, వాటర్ ట్యాంకులోని చేపలు చనిపోయి అందులోంచి దుర్వాసన వస్తోందని ఆ పిటిషన్లో జైన్ పేర్కొన్నారు. ఈ పరిస్థితికి, చేపలు చనిపోవడానికి అంజుమాన్ ఇంతెజామియా మసీదు మేనేజిమెంట్ కమిటీదే బాధ్యతని పేర్కొన్నారు.
వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ అభ్యర్థన ప్రకారం చేపలను తరలించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని తెలిపారు. కాగా, మసీదు కాంప్లెక్స్లో 2022 మేలో శివలింగం కనిపించడంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో వాజూఖానా ప్రాంతాన్ని సీల్ చేశారు. మసీదులో కనిపించినది శివలింగమేనని అని హిందూవర్గాలు అంటుండగా, అది ఫౌంటెన్ అని ముస్లిం వర్గాలు వాదిస్తున్నాయి.
More Stories
కేదార్ నాథ్ ధామ్ యాత్ర నేటి నుంచే
ప్రశాంతంగా మూడో దశలో 64.58% పోలింగ్
ప్రతి సోమవారం ఇస్త్రీ చేయని ముడతల దుస్తులే