తేజ సజ్జ నటించిన ఈ హనుమాన్ చిత్రం గత శుక్రవారం విడుదల కాగా, సోమవారానికి నాలుగు రోజుల్లో రూ.97 కోట్లు రాబట్టింది. సంక్రాంతి రోజు ఈ చిత్రం మరింత చెలరేగింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో హనుమాన్ వసూళ్లు రోజురోజుకూ పెరుగుతూనే ఉండటం విశేషం.
హనుమాన్ మూవీ నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.11 కోట్లు వసూలు చేసింది. అంటే తొలి రోజు వసూళ్ల కంటే కూడా ఇది రెట్టింపు. ఆ లెక్కన హనుమాన్ దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక హిందీ బెల్ట్ లో మాత్రం సోమవారం వసూళ్ల కాస్త తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో పండగ సెలవు ఉన్నా, అక్కడ చాలా రాష్ట్రాల్లో లేకపోవడంతో ఆ ప్రభావం వసూళ్లపై పడింది.
మూడో రోజు అక్కడ అత్యధికంగా రూ.6 కోట్లు రాగా, నాలుగో రోజు రూ.3.75 కోట్లు వచ్చాయి. అలా చూసుకున్నా తొలి రోజు కంటే ఇవి ఎక్కువే. హనుమాన్ విడుదల రోజు హిందీ బెల్ట్ లో రూ.2.1 కోట్లు వసూలు చేసింది. ఫస్ట్ వీకెండ్ లో ప్రపంచవ్యాప్తంగా రూ.73 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన హనుమాన్ నాలుగో రోజు మరో రూ.24 కోట్లతో మొత్తంగా రూ.97 కోట్ల గ్రాస్ వచ్చింది.
తెలుగులో నాలుగు రోజులు కలిపి రూ.39.21 కోట్లు వసూలు చేయగా, హిందీలో రూ.15.75 కోట్లు వచ్చాయి. మిగతా భాషలైన తమిళం, కన్నడ, మలయాళంలలో మాత్రం ఊహించిన స్పందన రావడం లేదు. తెలుగులో గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగలాంటి పెద్ద హీరోల సినిమాలకు గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ హనుమాన్ ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం నిజంగా విశేషమే.
హనుమాన్ చిత్రం ఉత్తర అమెరికాలో రికార్డు సృష్టించింది. అక్కడ 4 రోజుల్లో 3 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దీంతో ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు సినిమాల్లో ఒకటిగా హనుమాన్ నిలిచింది.
హనుమాన్ చిత్రం విజయం సాధించడంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ జోరు మీదున్నాడు. ఇలాంటి ఇండియన్ సూపర్ హీరో సినిమాలు మొత్తం 12 తీస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ ను వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. సముద్రఖని క్యారెక్టర్ ద్వారా సీక్వెల్ పాయింట్ను చెప్పించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.
ఈ ఏడాది వేసవిలో జై హనుమాన్ మూవీ షూటింగ్ ప్రారంభమవుతుందని అంటున్నారు. హనుమాన్లో ఉన్న నటీనటులతో పాటు మరికొంద మంది పాన్ ఇండియన్ స్టార్స్ ఈ సీక్వెల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. జై హనుమాన్ కూడా పాన్ ఇండియన్ లెవెల్లో అన్ని భాషల్లో విడుదల చేసేందుకు ప్రశాంత్ వర్మ సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
More Stories
తెలంగాణ ప్రజల్లో బిజెపి పట్ల విశ్వాసం పెరిగింది
పార్టీపై విమర్శలు చేయడంతోనే వరుణ్ గాంధీకి సీటు రాలేదు!
రాహుల్ బాబాకు దేశాన్ని అప్పగిస్తే అధోగతి పాలే