ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నం ఒంటి గంట వరకు పూర్తయ్యే అవకాశం ఉందని వివరించారు. వారణాసికి చెందిన గణేశ్వర శాస్త్రి ద్రవిడ్ ముహుర్తాన్ని నిర్ణయించారని, ఆయనే ఆచార వ్యవహారాలను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ప్రధాన ఆచార్యుడిగా కాశీకి చెందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ వ్యవహరించనున్నారు.
రాముడి విగ్రహం బరువు 150 నుంచి 200 కిలోల వరకు ఉంటుందని చెప్పారు. 121 మంది ఆచార్యులు ఈ మతపరమైన క్రతువును నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లతో పాటు ఇతర ప్రముఖుల సమక్షంలో రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందని చంపత్ రాయ్ వివరించారు.
ఈ నెల 23 నుంచి సాధారణ భక్తులు దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. దేశంలోని 130 కోట్ల మంది అయోధ్యకు రావొచ్చు. ఏ రోజు వచ్చినా భక్తులు ఆ రోజు దర్శనం చేసుకుని రాత్రి తిరిగి వెళ్లిపోయేలా ప్రణాళిక రచిస్తున్నామని చంపత్ రాయ్ చెప్పారు.
More Stories
ఉత్తరాఖండ్ అడవుల్లో ఆగని మంటలపై `సుప్రీం’ మండిపాటు
ఎన్నికల వేళ పాక్ సరిహద్దులో 49 డ్రోన్లు స్వాధీనం
విపత్తుల ఫలితంగా భారత్ లో 5 లక్షల మంది నిరాశ్రయం