ఇందులో కొత్తగా ఓటు కోసం 7,69,048 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఓటు తొలగింపు కోసం 2,90,123 మంది, చిరునామా మార్పు కోసం 1,40,679 మంది దరఖాస్తు చేసినట్లు వివరించారు. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత ముసాయిదా జాబితాను ప్రచురించారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 22వ తేదీలోగా తెలుపవచ్చని ఎన్నికల సంఘం ప్రకటించింది. అభ్యంతరాలను తెలిపేందుకు తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 20, 21వ తేదీల్లో ప్రత్యేకంగా బూత్స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు.
పోలింగ్ కేంద్రాల వద్దే ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను అక్కడే తెలుపవచ్చని, జాబితాపై వచ్చే అభ్యంతరాలను స్వీకరించి, అభ్యంతరాలను ఫిబ్రవరి 2వ తేదీలోగా పరిష్కరించనున్నట్టు వెల్లడించారు. ఫిబ్రవరి 8న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని, ఓటర్లు తమ ఓటు జాబితాలో ఉందో లేదో మరోసారి సరిచూసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సూచించారు.

More Stories
లడాఖ్కు బైక్ యాత్ర యువతికి దత్తాత్రేయ అభినందనలు
ఏపీ లిక్కర్ స్కాంలో రాజ్ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డి అరెస్ట్
పరస్పరం అవినీతి కప్పిపుచ్చుకుంటున్న బిఆర్ఎస్, కాంగ్రెస్