లోక్‌సభ స్థానాలకు బిజెపి ఇన్‌ఛార్జ్‌లు వీరే

తెలంగాణలోని లోక్‌సభ స్థానాలకు బిజెపి ఇన్‌ఛార్జులను నియమించింది. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఇన్‌ఛార్జులను ప్రకటించింది. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీని ఇన్‌ఛార్జులుగా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి బాధ్యతలు అప్పగించారు.
  • ఆదిలాబాద్ – పాయల్‌ శంకర్, ఎమ్మెల్యే
  • పెద్దపల్లి – పవార్ రామారావు పటేల్, ఎమ్మెల్యే
  • కరీంనగర్ – ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్యే
  • నిజామాబాద్ – ఏలేటి మహేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే
  • జహీరాబాద్ – కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్యే
  • మెదక్ – పాల్వాయి హరీశ్‌ బాబు, ఎమ్మెల్యే
  • మల్కాజిగిరి – పైడి రాకేశ్‌ రెడ్డి, ఎమ్మె్ల్యే
  • సికింద్రాబాద్ – కె.లక్ష్మణ్, ఎంపీ
  • హైదరాబాద్ – రాజాసింగ్, ఎమ్మెల్యే
  • చేవెళ్ల – ఏ వెంకట నారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ
  • మహబూబ్‌నగర్ – రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ
  • నాగర్‌ కర్నూల్ – మాగం రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ
  • నల్లగొండ – చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే
  • భువనగిరి – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే
  • వరంగల్ – మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ మంత్రి
  • మహబూబాబాద్ – గరికపాటి మోహనరావు, మాజీ ఎంపీ
  • ఖమ్మం – పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ

కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో బిజెపి ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, బండి‌ సంజయ్, ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబిసి మోర్చా అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ ధర్మపురి అర్వింద్ తదితరులు హాజరయ్యారు. 

పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థులు, అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ సీట్లే లక్ష్యంగా బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. కాగా, నేతల మధ్య సమన్వయం బాధ్యతను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పార్టీ అప్పగించింది. కనీసం 10 లోక్ సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. ఇదే సత్తా లోక్ సభ ఎన్నికల్లో కూడా చూపాలని నేతలు భావిస్తున్నారు.