ఢిల్లీలోని ప్రభుత్వ మొహల్లా క్లినిక్కుల్లో నకిలీ టెస్టుల ఆరోపణలపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గురువారం సీబీఐ విచారణకు ఆదేశించారు. ఢిల్లీ ప్రభుత్వ దవాఖానలకు నాణ్యత లేని మందులు సరఫరా చేశారన్న ఆరోపణలు వచ్చిన కొద్ది రోజులకే ఈ విచారణకు ఆదేశించడం గమనార్హం. ‘వైద్యులు మొహల్లా క్లినిక్కులకు రాకపోయినా హాజరైనట్టు, మందులు, టెస్టులు రాసినట్టు చూపించారు.
కానీ నకిలీ రోగులకు ఈ టెస్టులు చేసినట్టు గుర్తించారు. దీంతో సీబీఐ దర్యాప్తునకు ఎల్జీ ఆదేశాలిచ్చారు’ అని రాజ్నివాస్ వర్గాలు తెలిపాయి. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ వెంటనే స్పందించలేదు. మొహల్లా క్లినిక్లలో తప్పులు చేసినందుకు ఆప్ ప్రభుత్వం గత ఏడాది పలువురు డాక్టర్లు, సిబ్బందిపై చర్యలు తీసుకుందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ గతంలో చెప్తూ, ఆరోగ్య శాఖ కార్యదర్శిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించేందుకు ఆప్ ప్రభుత్వం మొహల్లా క్లినిక్లను ఏర్పాటు చేసింది. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ క్లినిక్లలో రోగులు లేకపోయినప్పటికీ రేడియాలజీ, పాథాలజీ పరీక్షలు నిర్వహించినట్లు నకిలీ పత్రాలను సృష్టిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో లెఫ్టెనెంట్ గవర్నర్ వికె సక్సేనా ఈ ఫిర్యాదులపై దర్యాప్తు జరపాల్సిందిగా సిబిఐని కోరినట్లు తెలుస్తోంది.
కొందరు డాక్టర్లు ఆలస్యంగా ఆస్పత్రులకు వెళుతూ వైద్య సేవలు అందించడంలో నిర్లక్షం వహిస్తున్నారని తెలుస్తోంది. మరికొందరు డాక్టర్లు అసలు క్లినిక్లకు రాకుండానే వచ్చినట్లు తప్పుడు రికార్డులు సృష్టిస్తున్నట్లు కూడా ఢిల్లీ ప్రభుత్వ విజిలెన్స్, ఆరోగ్య విభాగాలు జరిపిన దర్యాప్తులో తేలింది. ఈ నిర్లక్షంపై గతంలోనూ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఏడుగురు డాక్టర్లపై వేటు పడింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఆరోగ్య వాఖ కార్యదర్శిని తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
More Stories
మహారాష్ట్ర నుండి ఉల్లి ఎగుమతులకు అనుమతి
రుతుపవనాల తర్వాతే ఆహార ధరలు తగ్గుముఖం
ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటా ఉపసంహరణ