
వైఎస్సార్ టీపీని కాంగ్రెస్లో విలీనం చేయడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా షర్మిల చెప్పారు. నేటి నుంచి కాంగ్రెస్లో వైటీపీ ఒక భాగమని చెబుతూ దేశంలోనే అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. దేశంలో అన్ని వర్గాలను న్యాయం చేసే పార్టీ అని ఆమె వెల్లడించారు. తన తండ్రి వైఎస్సార్ తన జీవితమంతా కాంగ్రెస్ కోసమే పనిచేశారని ఆమె గుర్తు చేశారు.
నాన్న అడుగు జాడల్లోనే నడుస్తున్నాని పేర్కొంటూ రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటం తన తండ్రి కల అని తెలిపారు. రాహుల్ జోడో యాత్ర వల్ల కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందని చెప్పారు. జోడో యాత్ర ప్రజలతోపాటు తనలో కూడా విశ్వాసాన్ని నింపిందని చెబుతూ కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శక్తివంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఎన్నికల్లో పోటీ చేయలేదని ఆమె స్పష్టం చేశారు.
తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యంగా షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు. తెలంగాణలో అధికారం కోసం సుదీర్ఘ పాదయాత్ర కూడా చేశారు. తెలంగాణ ఎన్నికల్లో పాలేరు నుంచి బరిలోకి దిగుతానని ప్రకటించిన షర్మిల, అనుహ్యంగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచి ఆమె షాకిచ్చారు.
More Stories
అమరావతి పర్యటనలో ప్రధాని మోదీ రోడ్ షో రద్దు
ఏపీ పట్టణాల్లో స్లీపర్సెల్స్ పై పోలీసుల డేగకన్ను
ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి అంత్యక్రియలు