
వచ్చే నెల రామ మందిరం ప్రతిష్ఠాపనకు అయోధ్య సన్నద్ధం అవుతుండగా, అయోధ్య పట్టణంలోని ప్రముఖ రోడ్డుపై సూర్య స్తంభాలను వరుసగా ఏర్పాటు చేస్తున్నారు. ౩౦ అడుగుల ఎత్తు ఉన్న ఆ స్తంభాలలో ప్రతి ఒక్క స్తంభానికి పైన ఏర్పాటు చేస్తున్న ప్రతిమ ఎలా ఉంటుందంటే రాత్రి వేళ వెలిగించినప్పుడు అది సూర్యుని ప్రతిబింబిస్తుంది.
ఉత్తర ప్రదేశ్ పబ్లిక్ వర్క్ అయోధ్య డివిజన్ సీనియర్ అధికారి ఒకరి సమాచారం ప్రకారం, ధర్మ్ పథ్ అనే ఆ రోడ్డుపై అటువంటి 40 స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆ రోడ్డు నయా ఘాట్ సమీపంలోని లతా మంగేష్కర్ చౌక్ను అయోధ్య బైపాస్తో అనుసంధానిస్తుంది.
‘కొత్తగా నిర్మించిన రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు ముందు ఆ సూర్య స్తంభాలను ఏర్పాటు చేసే పని సాగుతోంది. వాటిలో 20 స్తంభాలను లతా మంగేష్కర్ చౌక్ సమీపంలో ఏర్పాటు చేస్తారు. రోడ్డుకు ఒక్కొక్క వైపు 10 స్తంభాలు ఉంటాయి’ అని పిడబ్లుడి అసిస్టెంట్ ఇంజనీర్ ఎ పి సింగ్ తెలియజేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల ౩౦న అయోధ్యకు రావలసి ఉన్నది. ఆ పర్యటనలో మోదీ పునర్వవస్థీకరించిన అయోధ్య రైల్వే స్టేషన్కు, కొత్త విమానాశ్రయానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఆయన ఒక ర్యాలీలో ప్రసంగిస్తారని అధికారులు తెలియజేశారు.
కాగా, అయోధ్య సర్వం రామమయంగా మారింది. వీధుల్లో ఎక్కడ చూసినా రామనామమే వినిపిస్తున్నది. దుకాణాల షట్టర్లు సైతం అయోధ్య రాముని పేరుతో పాటు స్వస్తిక్ గుర్తులతో నిండిపోయాయి. అయోధ్యకు దారితీసే 13 కిలోమీటర్ల పొడవైన సహదాత్గంజ్ నయాఘాట్ రోడ్లో రెండు వైపులా పెద్దయెత్తున దుకాణాలు ఉంటాయి.
More Stories
రూ. 1 లక్ష కోట్లతో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తొలి బడ్జెట్
నాపై సెటైర్లు వేయడానికి కమ్రా సుపారి తీసుకున్నట్లుంది
భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి