క్రిస్మస్, న్యూయర్ వేడుకలు పూరయ్యాక రోజువారీ కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 2020-22 సంవత్సరాల మధ్య కరోనా ట్రెండ్ను సమీక్షించగా జనవరిలో కరోనా కేసుల పెరుగుదల కనిపించింది. ఒమిక్రాన్ కారణంగా డిసెంబర్- జనవరి మధ్య గతేడాది కరోనా రోజువారీ కేసులు పెరిగాయి.
ఫిబ్రవరిలో కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం జేఎన్.1 వేరియంట్ సబ్ ఫామ్ సైతం వ్యాప్తి చెందుతున్నది. దీని ఆర్ విలువ అంటే.. ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువగా ఉన్నది. ఈ పరిస్థితుల్లో క్రిస్మస్, న్యూ ఇయర్ కారణంగా జనవరి మొదటి వారంలో కేసులు భారీగా పెరిగితే మరో మూడు వారాలు కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎంతకాలం స్థిరంగా ఉంటుందో అంచనా వేయడం సాధ్యం కాదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల కరోనా కేసులు పెరుగుతుండడంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4వేల మార్క్ను దాటింది. ఇందులో అత్యధికంగా కేసులు 3 వేలకు పైగా కేరళలోనే నమోదయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో 529 కొవిడ్ కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,093గా ఉంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ పాజిటివ్ తేలితే తప్పనిసరిగా ఏడు రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఇక బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు తప్పకుండా మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు.
More Stories
వడ్డీ రేట్లను భారీగా పెంచిన స్టేట్ బ్యాంకు
చాబహార్ పోర్టుపై చిన్న చూపు తగదు .. అమెరికాకు హితవు
ఏపీలో పోలింగ్ ముగిసినా పలుచోట్ల హింసాత్మక ఘటనలు