తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఢిల్లీలో సుమారు గంట పాటు వీరి భేటీ జరిగినట్టు సమాచారం. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన వీరికి.. ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలుపగా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఇరువురు నేతలూ కోరగా.. ప్రధాని మోదీ సైతం రాష్ట్రాల సర్వతోముఖాభివృద్దే తమ లక్ష్యమని తెలిపారు. పార్టీలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు.
More Stories
హిమాచల్లో సుఖు సర్కారు కుప్పకూలిపోవచ్చు
ఇంగ్లాండ్ మ్యాచ్లో రికార్డులు సృష్టిస్తున్న జైస్వాల్
రెండు చోట్లా ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు