ఉగ్రవాద ప్రేరేపిత సంస్థ తబ్లిగి జమాతే తెలంగాణాలో నిర్వహిస్తున్న సమావేశానికి అనుమతి రద్దు చేయాలని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ డిమాండ్ చేశాయి. రాష్ట్ర డిజిపి రవి గుప్తాకు సమర్పించిన వినతిపత్రంలో రాజ్యాంగ విరుద్ధంగా ఒక తీవ్రవాద సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి నిధులు కేటాయించడాన్ని తీవ్రంగా ఖండించారు.
విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్, సహకార్యదర్శులు గణపురం రాజేశ్వర్ రెడ్డి, భాను ప్రసాద్, ప్రచార ప్రసార ప్రముఖ్ పగడాకుల బాలస్వామి గారు, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివ రాములు, తిరుపతి నాయక్ డిజిపిని కలిసి వినతిపత్రం సమ్పరించారు.
అసాంఘిక కార్యకలాపాలు, హిందూ వ్యతిరేక చర్యలు, సనాతన ధర్మంపై దాడి, భారతీయ అస్తిత్వంపై విద్వేషం చిమ్మే సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం రాజ్యాంగ విరుద్ధం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యులర్ దేశంలో మత చాందోసవాదులకు నిధులు కేటాయించడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నించారు.
తబ్లికి జమాతే సంస్థలు పలు ముస్లిం దేశాలు కూడా నిషేధించిన విషయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? అంటూ విస్మయం వ్యక్తం చేశారు. 2024 జనవరి 6 7 8 తేదీలలో వికారాబాద్ జిల్లా పరిగి సమీపంలో నిర్వహించే తబ్లిగీ జమాతే సమావేశాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమాజంలో అలజడులు సృష్టించి దేశ ప్రగతికి విరోధాలు కలిగించే సంస్థలను రూపుమాపాలని కోరారు.
2020లో ఢిల్లీలో నిర్వహించిన పబ్లిగీ జమతే వల్ల దేశంలో కరోనా పెల్లుబికిన విషయం ఇంకా భారతీయ సమాజం మర్చిపోలేదని వారు గుర్తు చేశారు. అమాయక యువకులను ప్రేరేపిస్తూ, హిందూ సంస్కృతి సంప్రదాయాలను విచ్చిన్నం చేయడమే లక్ష్యంగా శిక్షణ ఇచ్చే ఇలాంటి సంస్థలను నిషేధించాల్సిందే అని స్పష్టం చేశారు.
ఈ సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ద్వారా విడుదల చేసిన రూ.2.46 కోట్లను వెంటనే రాష్ట్రప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సిందే అని తెలిపారు. లేదంటే విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేయక తప్పదని హెచ్చరించారు.
More Stories
మోదీకి 75 ఏళ్లు వచ్చినా ప్రధానిగా కొనసాగుతారు
రాహుల్ బాబాకు దేశాన్ని అప్పగిస్తే అధోగతి పాలే
డీకే అరుణ పార్లమెంట్లో అడుగుపెడుతారనే ప్రధాన విశ్వాసం