అద్భుతమైన మహానగరంగా రాజమండ్రి

రాజమండ్రి నగరాన్ని అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతామని కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. రూ.347.15 కోట్లతో టెర్మినల్ బిల్డింగ్ తదితర అభివృద్ధి పనులు ప్రారంభిస్తూ ఇక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు విమానాలు వెళ్లేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
అత్యాధునిక  టెక్నాలజీతో అద్భుతమైన ఫీచర్లతో నిర్మాణం జరుగుతుందని చెప్పారు. క
 
నివిని ఎరుగని రీతిలో ఇక్కడ టర్మినల్ను నిర్మిస్తామని చెబుతూ టర్మినల్ నిర్మాణం తొందరలో పూర్తైతే రాజమండ్రి నుంచి అన్ని ప్రాంతాలకు విమానాలు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి దేశంలో 10 నగరాలకు విమానాలు తిరుగుతున్నాయని పేర్కొన్నారు. 
 
రానున్న రోజుల్లో దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులకు ధీటుగా ఇక్కడ ఎయిర్ పోర్టును అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. రాజమండ్రి నేలపై నిలబడినందుకు సంతోషంగా ఉందని పేర్కొంటూ సంస్కృతి సంప్రదాయాలకు రాజమండ్రి నెలవు అని కొనియాడారు. తెలుగు భాష చాలా అందమైన భాష, తెలుగు లిపి కూడా అద్భుతంగా ఉంటుందని తెలిపారు. 
 
 ఇది ఆది కవి నన్నయ్య పుట్టిన ప్రాంతమని, అఖండ గోదావరి ఉన్న అద్భుతమైన నేల ఇది అంటూ  ఇక్కడ ప్రజలు మానసికంగా, శారీరకంగా చాలా దృఢంగా ఉంటారని కొనియాడారు. ఇక్కడి నుంచి ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులు పుట్టుకొచ్చారని గుర్తు చేశారు. ఇక్కడ మట్టికి, నేలకు, గోదావరికి సలాం చేస్తున్నానని తెలిపారు. కోటిలింగాల రేవు, మారేడుమిల్లి ప్రాంతం, సముద్ర తీర ప్రాంతం ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయని తెలిపారు.