కాంగ్రెస్ పార్టీ అవినీతికి కేరాఫ్ అడ్రస్ అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో వందల కోట్ల అవినీతికి ప్రజా ప్రతినిధులే పాల్పడుతున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహూపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తే రూ. 200 కోట్ల నగదు అధికారికంగా లెక్క తేల్చారని ఆమె గుర్తు చేశారు. అయితే లెక్క తేల్చాల్సిన నగదు ఇంకా ఉందని అధికారులు చెబుతున్న తీరు పరిశీలిస్తే కాంగ్రెస్ ఎంపీల అవినీతి ఎంత అన్నది తేలుతోందని ఆమె ఎద్దేవా చేశారు.
నాటు సారాతో ఈ సొమ్ము సంపాదించినట్లుగా తెలుస్తోందని చెబుతూ ఇదంతా నల్లధనమే అన్నవిషయం ప్రజలకు అర్ధం అవుతోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్తీస్ఘడ్, ఒరిస్సా, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ధీరజ్ సాహూ కుటుంబ సభ్యులపై జరుగుతున్న దాడుల్లో లెక్కకు మించిన నల్లధనం వెలుగు చూస్తోందని చెప్పారు.
More Stories
ధర్మవరంలో బిజెపి కార్యకర్తలలపై రెచ్చిపోయిన వైసీపీ మూకలు
బీజేపీ గెలుపు మన దేశానికి అవసరం
ఏపీలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సీఆర్పీఎఫ్ బలగాలు