అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ప్రధాని నివాళులు

సమాజంలో దోపిడీకి, అన్యాయాలకు బలైపోతున్న అట్టడుగువర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్ తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బుధవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు.  రాజ్యాంగ రూపశిల్పియే కాకుండా సామాజిక సామరస్యానికి అజరామరమైన ఛాంపియన్‌గా నిలిచారని కొనియాడారు. దళిత కుటుంబం నుంచి వచ్చి భారత రాజకీయాల్లో అత్యంత ప్రధాన నాయకునిగా ఎదిగారని ప్రధాని తెలిపారు. 

1956 లో కన్నుమూసినప్పటికీ ఆయన భావజాలం, ఆలోచనలకు దక్కిన గుర్తింపు ఏళ్లకొలది పెరుగుతూనే ఉందని చెప్పారు. ముఖ్యంగా దళిత నేపథ్యం , షెడ్యూల్డ్ కులాల్లో ఆధారమై ఓటింగ్ సరళిని ప్రభావితం చేస్తోందని వివరించారు. అలాగే ఆయన స్ఫూరి ఇతర బలహానవర్గాలు విద్యారంగంలోనూ రాజ్యాంగపరమైన ఆందోళనలకు, ఏకీకరణకు ఊతం కలిగిస్తోందని ప్రధాని ఉదహరించారు.

కాగా, అంబేద్కర్ విలువల కోసం మనం నిత్యం శ్రమించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ సూచించారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బుధవారం చంద్రచూడ్, ఇతర జడ్జీలు నివాళులు అర్పించారు.  సుప్రీంకోర్టుకు ఇది చారిత్రక దినమని ఎందుకంటే డిసెంబర్ 6 చారిత్రాత్మకమైనదని, సుప్రీం కోర్టు ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ద్వారా చరిత్రలో మనం పాలుపంచుకుంటున్నామని చంద్రచూడ్ పేర్కొన్నారు. 
 
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు నివాళి అర్పించడం ద్వారా మనకు మనం గౌరవించుకుంటున్నామని వివరించారు. నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీం కోర్టు ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.