కాగా, మహారాష్ట్ర, మేఘాలయ, నాగాలాండ్, సిక్కింలో మిత్రపక్షాలతో కలిసి బీజేపీ అధికారంలో ఉన్నది. కూటమి ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలను కూడా పరిగణలోకి తీసుకుంటే దేశ జనాభాలో సగానికిపైగా బీజేపీ పాలిస్తున్నది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు దేశ భూభాగంలో 58 శాతంగా, జనాభాలో 57 శాతంగా ఉన్నాయి. ఉత్తర భారత దేశంతో, ప్రధానంగా హిందీ రాష్ట్రాల్లో బీజేపీ ఆధిపత్యం కొనసాగుతుంది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు రాష్ట్రాలకే పరిమితమైంది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలతోపాటు తాజాగా తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. దేశ జనాభాలో 8.51 శాతం మాత్రమే కాంగ్రెస్ పాలన పరిమితమైంది. బీహార్, జార్ఖండ్, తమిళనాడులలో కూటమి పార్టీలతో కలిసి కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. ఇది కూడా కలుపుకుంటే దేశ జనాభాలో 19.84 శాతం పాలనకే కాంగ్రెస్ పరిమితమైంది.
ఇక ప్రతిపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలు దేశ భూభాగంలో 41 శాతం, దేశ జనాభాలో 43 శాతం మాత్రమే. ఈ నేపథ్యంలో పరిస్థితి ఇలా ఉంటే 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీపై విజయం సాధించడం చాలా కష్టమని ‘ఇండియా’ బ్లాక్ నేతలు పెదవి విరుస్తున్నారు. ప్రతిపక్షాల కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ తీరుపై మండిపడుతున్నారు.
More Stories
ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలపై సిబిఐ దర్యాప్తు
హర్యానా లో మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు
కాంగ్రెస్ వస్తే రామ మందిరానికి బాబ్రీ తాళం.. అందుకే 400 సీట్లు