పాతబస్తీలో బద్దం బాల్ రెడ్డి తర్వాత రాజాసింగే రికార్డు!

* 8 మందితో అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా బిజెపి
*19 చోట్ల రెండో స్థానంలో బీజేపీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ హ్యాట్రిక్ విజయం సాధించారు. 21,457 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి నంద కుమార్ వ్యాస్‌ను ఓడించారు. వ్యాస్‌కు 58, 725 ఓట్లు రాగా,  రాజాసింగ్‌కు 80,182 ఓట్లు వచ్చాయి.
అయన 2014, 2018 ఎన్నికలతో పాటు తాజా ఎన్నికల్లోనూ విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. పాతబస్తీలో బీజేపీ అగ్రనేత బద్దం బాల్ రెడ్డి తర్వాత హ్యా్ట్రిక్ సాధించి రాజాసింగ్ రికార్డ్ సృష్టించారు. హైదరాబాద్ పాతబస్తీ ఎంఐఎం పార్టీకి కంచుకోట. అక్కడ మస్లిం ఓటు బ్యాంకే అధికం. గతకొన్ని దశాబ్దాలుగా ఏ పార్టీ పోటీ చేసినా ఓటమి ఖాయం.
 
కనీసం మేనిఫెస్టో కూడా లేకుండా ఆ పార్టీ అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుండగా పాతబస్తీ వాసులు వారికే పట్టం కడుతున్నారు. అయితే మస్లిం ఓటు బ్యాంకు అధికంగా ఉన్న పాతబస్తీలో ఓ హిందూనేత హ్యాట్రిక్ విజయాలు సాధించారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి మజ్లిస్ కంచుకోటలో కాషాయ జెండాను రెపరెపలాడించారు బద్దం బాల్ రెడ్డి.
 

1985 నుంచి 1994 వరకు 3 సార్లు కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1991,1998, 1999లో హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి బద్దం గట్టి పోటీనిచ్చారు. స్వల్ప తేడాతో ఓటమి పాలై రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత 1999, 2004, 2009, 2014 కార్వాన్‌ నుంచి 2018లో రాజేంద్రనగర్‌ నుంచి ఎమ్మెల్యేగా ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేసినా ఆయనకు విజయం వరించలేదు.

బాల్ రెడ్డి తర్వాత మజ్లిస్ అభ్యర్థులు తప్ప మరెవరూ పాతబస్తీ నుంచి హ్యాట్రిక్ సాధించలేదు. ప్రస్తుతం ఆ అవకాశం బీజేపీ నుంచే పోటీ చేస్తున్న రాజాసింగ్‌కు వచ్చింది. రాజాసింగ్ 2014, 2018 నుంచి గోషామహల్ ఎమ్మేల్యేగా గెలుపొందారు. ఈ సెంగ్మెంట్ పాతబస్తీ పరిధిలోకే వస్తుంది.  దీంతో మరోసారి ఇక్కడి నుంచే గెలుపొంది రాజాసింగ్ బాల్ రెడ్డి సరనస చేరారు. 2021లో రాజాసింగ్‌పై బీజేపీ జాతీయ నాయకత్వం సస్పెన్షన్ విధించింది. ఈ ఎన్నికల ముందు రాజాసింగ్‌పై బీజేపీ నాయకత్వం సస్పెన్షన్ ఎత్తేసిన విషయం తెలిసిందే.

ఇలా ఉండగా,  8 మంది బిజెపి అభ్యర్థులు తెలంగాణాలో గెలుపొందారు. దానితో తెలంగాణ అసెంబ్లీలో మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇప్పటివరకు ఆ స్థానంలో ఎంఐఎం ఉంది. మరో 19 స్థానాలలో బిజెపి రెండో స్థానంలో ఉంది. కీలకంగా కామారెడ్డిలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో పాటు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని బిజెపి అభ్యర్థి కె. వెంకటరమణారెడ్డి ఓడించారు.
 

గెలుపొందిన బీజేపీ అభ్యర్థులు:

  • సిర్పూర్ -డా.పాల్వాయి హరీష్ బాబు
  • ఆదిలాబాద్- పాయల్ శంకర్
  • నిర్మల్- అల్లేటి మహేశ్వర్ రెడ్డి
  • ముధోల్- రామ్ రావు పవార్
  • ఆర్మూర్- పైడి రాకేష్ రెడ్డి
  • కామారెడ్డి- కాటిపల్లి వెంకట రమణా  రెడ్డి
  • నిజామాబాద్ (అర్బన్)-ధనపాల్ సూర్యనారాయణ
  • గోషామహల్- టి. రాజా సింగ్
బీజేపీ రెండో స్థానంలో ఉన్న 19 నియోజకవర్గాలు
 
1. అంబర్ పెట్, 2. చాంద్రాయణగుట్ట, 3. చార్మినార్, 4. కార్వాన్, 5. సనత్ నగర్, 6. ఎల్బీనగర్, 7. సికింద్రాబాద్ కంటోన్మెంట్, 8.  రాజేంద్రనగర్, 9.  కుతుబుల్లాపూర్, 10. మహేశ్వరం, 11.  గజ్వేల్, 12. దుబ్బాక,  13.
హుజురాబాద్, 14. కరీంనగర్, 15. బోథ్,16. కల్వకుర్తి 17. మంచిర్యాల్,
18. వరంగల్ ఈస్ట్, 19, కోరుట్ల